Political News

ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్‌ ఏం చేయాలి.. ఏం చేస్తాడో?

రాష్ట్రంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అయింది. ఇది ఏ ప్ర‌భుత్వానికైనా.. చాలా మెజారిటీ కాలం. అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామం ఎదురైంది. క‌రోనా రావ‌డంతో రెండేళ్ల కాలం కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది. దీంతో అభివృద్ధి చేసేందుకు.. పెట్టుబ‌డులు తెచ్చేందుకు కొంత ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌నేది వాస్త‌వం. అయితే.. ఈ విష‌యాన్ని ప్రొజెక్టు చేసుకుని.. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో వైసీపీ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు.

ఎందుకంటే.. ఇప్పుడు ఎక్క‌డా ఈ మాటే వినిపించ‌డం లేదు. మేం అంతిచ్చాం.. ఇంతిచ్చాం.. అని చెబు తున్నారు. అయితే.. సంక్షేమం అందున్నవారు.. ఓకే.. వారు మౌనంగా ఉన్నారు. కానీ, అంద‌ని వారే ఎక్కు వ మంది ఉన్నారు. వీరే మౌనంగా ఉంటున్నారు. దీంతో మంత్రులు, స‌ర్కారు చెబుతున్న వాద‌న బ‌లంగా వెల్ల‌డం లేదు. అదే స‌మ‌యంలో విప‌క్షాలు చేస్తున్న అభివృద్ధి లేద‌నే వాద‌న బ‌లంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్ర‌తిప‌క్షాల వాద‌న‌ను ప‌క్క‌న పెట్టేలా.. అస‌లు ఏం జ‌రిగింది! అనే విష‌యాల‌ను వైసీపీ నాయకులు వినిపించ‌లేక పోయారు.

దీంతో అభివృద్ధి చేయ‌ని పార్టీగా. వైసీపీ నిలిచిపోయింది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ముందు రెండేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ రెండేళ్ల‌లో ఏం చేస్తారు? ఎలా చేస్తారు?  ఏ విధంగా రాష్ట్రాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నా రు? అనేది ఆస‌క్తిగా మారింది. మూడు రాజధానుల నిర్మాణాల‌ను ముందుకు తీసుకువెళ్తారా ? అమ‌రావ‌తినే అభివృద్ది చేస్తారా ?  పోల‌వ‌రం ప‌రిస్థితి ఏంటి ? వెనుక‌బ‌డిన జిల్లాల‌ను ఎలా అభివృద్ధి చేస్తారు? అనే  ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ల‌భించ‌డం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా.. ఇప్పుడు మాత్రం ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసింది. ప్ర‌జ‌లు కూడా త‌మ‌కు ప్ర‌యోజ‌నం ఉన్న ప్ర‌భుత్వం కావాల‌నే కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో.. వైసీపీ స‌ర్కా రు ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ చేయ‌లేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్తోంది. దీనికితోడు రాష్ట్రంలో  ర‌హ‌దారులు గుంత‌లు ప‌డ‌డం.. వాటిని కూడా పూడ్చుకోలేక పోవ‌డం వంటివి పెద్ద ఎత్తున ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్ల పాటు ఆయ‌న ఏం చేస్తార‌నేది ప్ర‌శ్న‌గా మారింది. 

This post was last modified on June 2, 2022 7:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

1 hour ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

3 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago