తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ను రాజకీయంగా టార్గెట్ చేయడమే కాకుండా సమ ఉజ్జీగా నిలబడే నేతలు ఎవరన్న ప్రశ్నకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి పలువురు ప్రతిపాదిస్తుంటారు. దీనికి రేవంత్ రెడ్డి అనుసరించే వ్యూహాలు, చేసే విమర్శలు వంటివి కారణంగా పేర్కొనవచ్చు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన గేమ్ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నారని… రేవంత్ రెడ్డి దూకుడే ఆయనకు శాపంగా మారాయని పలువురు చర్చించుకుంటున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంఘటనలే దీనికి తార్కాణమని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గులాబీ దళపతి సహా ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలకు కాంగ్రెస్ శ్రేణులు మొదట్లో మద్దతు ఇచ్చినప్పటికీ వరుసగా అవే కామెంట్లు చేయడం పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని అంటున్నారు.
రేవంత్ వ్యాఖ్యల వల్ల కేవలం కేసీఆర్ కుటుంబ టార్గెట్గా మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని, అసలు సమస్యలను వదిలేశారని సంకేతాలు రాష్ట్రంలోకి వెళ్లాయని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెడ్డిలకు రాజ్యాధికారం అనే నినాదాన్ని రేవంత్ రెడ్ది తీసుకురావడంతో రాజకీయాలు కులం, కుటుంబం టార్గెట్గా మారాయని పార్టీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేల నుంచి మొదలుకుని మంత్రుల వరకు విమర్శలకు దిగుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి కౌంటర్ రాకపోవడం గురించి విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
తాజాగా జరుగుతున్న చింతన్ శిబిర్ సైతం పార్టీలోని అసంతృప్తులకు నిదర్శమని చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలసీని ప్రకటించే చింతన్ శిబిర్ రేవంత్ రెడ్డి లేకుండానే నిర్వహించేస్తున్నారు. ఇప్పటిదాకా పార్టీలో ఎంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా, సడెన్గా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించినా పార్టీలో నిర్ణయమే ఫైనల్ అనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు అధిష్టానం దగ్గర రేవంత్ గ్రాఫ్ డౌన్ అయిందనే ఫీలింగ్లో ఉండటం వల్లే కాంగ్రెస్ సీనియర్లు ఈ రకంగా తమ ఎజెండాతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
This post was last modified on June 1, 2022 5:48 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…