Political News

కేంద్ర మంత్రికి ‘మహానటి’ డైరెక్టర్ కౌంటర్

‘మహానటి’ సినిమాతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో వందల కోట్ల బడ్జెట్లో ‘ప్రాజెక్ట్ కే’ లాంటి భారీ చిత్రం చేసే అవకావం దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. ఐతే దర్శకుడిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసి తిరుగులేని స్థాయికి చేరుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఒక సామాన్యుడిలాగే కనిపిస్తుంటాడు నాగ్ అశ్విన్. ఒక మామూలు నెటిజన్ ఎవరో ఏదైనా ప్రశ్న అడిగినా బదులిస్తాడు.

అలాగే చాలామంది సెలబ్రెటీల్లాగా సోషల్ ఇష్యూస్ విషయంలో మనకెందుకు అనుకోకుండా స్పందిస్తుంటాడు. తన ‘ప్రాజెక్ట్ కే’ సినిమా కోసం స్పెషల్ వెహికల్స్ కావాలని మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ వేదికగా విన్నవించి.. ఆయన్నుంచి ఆహ్వానం అందుకుని, తన కంపెనీకి వెళ్లి రావడం తెలిసిందే. ఇప్పుడు నాగ్ అశ్విన్.. ఒక కేంద్ర మంత్రికి ట్విట్టర్ వేదికగా డైరెక్ట్ కౌంటర్ వేసేశాడు. అలాగని అదేమీ తీవ్ర విమర్శ ఏమీ కాదు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు చేరుకోవాలంటే అందరూ తిరుపతిలోనే దిగాలి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో రోజూ వేలమంది ఇక్కడికి వస్తుంటారు. ఐతే ఎంతో బిజీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ చాలా ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆ రైల్వే స్టేషన్‌ను అధునాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. కొత్తగా రూపుదిద్దుకోబోతున్న తిరుపతి రైల్వే స్టేషన్ నమూనాలను ట్విట్టర్లో పంచుకున్నారు.

తిరుపతిలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతోందని ఘనంగా ప్రకటించారు. ఐతే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రైల్వే స్టేషన్ అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కాకుండా ఏదో విదేశీ స్టేషన్‌ను కాపీ కొట్టినట్లుగా ఉందని, బ్యాడ్ ఐపీ పార్కును తలపిస్తోందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. ఈ డిజైన్ ఎవ్వరికీ నచ్చడం లేదని, కావాలంటే కామెంట్లు చూస్తే అర్థమవుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. భారతీయ సంస్కృతిని సరిగ్గా అర్థం చేసుకునే వారికి బాధ్యత అప్పగించి డిజైన్ మార్చాలని నాగ్ అశ్విన్ విన్నవించాడు. నెటిజన్లు చాలామంది నాగ్ అశ్విన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలవడం విశేషం.

This post was last modified on May 31, 2022 2:37 pm

Share

Recent Posts

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

1 hour ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

2 hours ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

2 hours ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

4 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

6 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

8 hours ago