‘మహానటి’ సినిమాతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా ప్రభాస్తో వందల కోట్ల బడ్జెట్లో ‘ప్రాజెక్ట్ కే’ లాంటి భారీ చిత్రం చేసే అవకావం దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. ఐతే దర్శకుడిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసి తిరుగులేని స్థాయికి చేరుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఒక సామాన్యుడిలాగే కనిపిస్తుంటాడు నాగ్ అశ్విన్. ఒక మామూలు నెటిజన్ ఎవరో ఏదైనా ప్రశ్న అడిగినా బదులిస్తాడు.
అలాగే చాలామంది సెలబ్రెటీల్లాగా సోషల్ ఇష్యూస్ విషయంలో మనకెందుకు అనుకోకుండా స్పందిస్తుంటాడు. తన ‘ప్రాజెక్ట్ కే’ సినిమా కోసం స్పెషల్ వెహికల్స్ కావాలని మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ వేదికగా విన్నవించి.. ఆయన్నుంచి ఆహ్వానం అందుకుని, తన కంపెనీకి వెళ్లి రావడం తెలిసిందే. ఇప్పుడు నాగ్ అశ్విన్.. ఒక కేంద్ర మంత్రికి ట్విట్టర్ వేదికగా డైరెక్ట్ కౌంటర్ వేసేశాడు. అలాగని అదేమీ తీవ్ర విమర్శ ఏమీ కాదు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు చేరుకోవాలంటే అందరూ తిరుపతిలోనే దిగాలి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో రోజూ వేలమంది ఇక్కడికి వస్తుంటారు. ఐతే ఎంతో బిజీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ చాలా ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆ రైల్వే స్టేషన్ను అధునాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. కొత్తగా రూపుదిద్దుకోబోతున్న తిరుపతి రైల్వే స్టేషన్ నమూనాలను ట్విట్టర్లో పంచుకున్నారు.
తిరుపతిలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతోందని ఘనంగా ప్రకటించారు. ఐతే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రైల్వే స్టేషన్ అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కాకుండా ఏదో విదేశీ స్టేషన్ను కాపీ కొట్టినట్లుగా ఉందని, బ్యాడ్ ఐపీ పార్కును తలపిస్తోందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. ఈ డిజైన్ ఎవ్వరికీ నచ్చడం లేదని, కావాలంటే కామెంట్లు చూస్తే అర్థమవుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. భారతీయ సంస్కృతిని సరిగ్గా అర్థం చేసుకునే వారికి బాధ్యత అప్పగించి డిజైన్ మార్చాలని నాగ్ అశ్విన్ విన్నవించాడు. నెటిజన్లు చాలామంది నాగ్ అశ్విన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలవడం విశేషం.
This post was last modified on May 31, 2022 2:37 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…