నగ్మా.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మారిచిపోయే పేరు కాదిది. ఘరానా మొగుడు సహా 90వ దశకంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి నిన్నటితరం ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసిన ఉత్తరాది భామ ఆమె. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు.. ఇలా అప్పటి టాప్ స్టార్లు అందరితోనూ సినిమాలు చేసిన నగ్మా.. ఫిలిం కెరీర్ ముగిశాక మళ్లీ ముంబయికి వెళ్లి సెటిలైపోయింది.
అక్కడి నుంచే ఆమె రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యలో ఏ పార్టీ వైపూ చూడకుండా అందులోనే ఆమె కొనసాగడం విశేషం. పార్టీ పరంగా ఆమెకు కొన్ని పదవులు వచ్చాయి కానీ.. అంతకు మించి అధికారిక పదవులేవీ ఆమెకు దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక ఆమె పొలిటికల్ గ్రాఫ్ పడిపోయింది.
ఐతే సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవ చేస్తుండటం, ప్రతిసారీ ఎన్నికల ప్రచారంలో బాగా కష్టపడుతుండటంతో నగ్మా రాజ్యసభ సభ్యురాలిగా పార్టీ తరఫున నామినేట్ అవుతుందని విశ్లేషకులు భావించారు. ఈ పర్యాయం అవకాశం దక్కుతుందని అంచనా వేసిన వాళ్లలో నగ్మా కూడా ఒకరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు మొండిచెయ్యే చూపించింది. దీంతో నగ్మాకు మండిపోయింది. ఆమె నేరుగా పార్టీ అధినాయకత్వం మీదే విమర్శలు గుప్పించింది.
తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తానని 2004లో స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకే తాను కాంగ్రెస్లో చేరానని.. ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా తనకు అవకాశం ఇవ్వలేదని.. తాను తక్కువ అర్హత కలిగినదాన్నా అంటూ ఆమె ట్విట్టర్లో నేరుగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రశ్న సంధించారు. 2004లో నగ్మా ముందు బీజేపీలో చేరుతుందని వార్తలొచ్చాయి. కానీ ఆమెకు పదవి ఆశచూపే కాంగ్రెస్లోకి లాగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నగ్మా ఆవేదన సరైందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 30, 2022 11:37 pm
సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది ``డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.`` అని. ఇక,…
ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది ఇండస్ట్రీలో సంపాదించే డబ్బులను భూమి మీద పెట్టుబడిగా పెడుతుంటారు. ఇలా పాత కాలంలో పెట్టుబడులు పెట్టిన…
అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు.. తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు .. తాజాగా రెండు మునిసిపల్ చైర్మన్…
బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు…
ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తయితే, నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…