నగ్మా.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మారిచిపోయే పేరు కాదిది. ఘరానా మొగుడు సహా 90వ దశకంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి నిన్నటితరం ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసిన ఉత్తరాది భామ ఆమె. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు.. ఇలా అప్పటి టాప్ స్టార్లు అందరితోనూ సినిమాలు చేసిన నగ్మా.. ఫిలిం కెరీర్ ముగిశాక మళ్లీ ముంబయికి వెళ్లి సెటిలైపోయింది.
అక్కడి నుంచే ఆమె రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యలో ఏ పార్టీ వైపూ చూడకుండా అందులోనే ఆమె కొనసాగడం విశేషం. పార్టీ పరంగా ఆమెకు కొన్ని పదవులు వచ్చాయి కానీ.. అంతకు మించి అధికారిక పదవులేవీ ఆమెకు దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక ఆమె పొలిటికల్ గ్రాఫ్ పడిపోయింది.
ఐతే సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవ చేస్తుండటం, ప్రతిసారీ ఎన్నికల ప్రచారంలో బాగా కష్టపడుతుండటంతో నగ్మా రాజ్యసభ సభ్యురాలిగా పార్టీ తరఫున నామినేట్ అవుతుందని విశ్లేషకులు భావించారు. ఈ పర్యాయం అవకాశం దక్కుతుందని అంచనా వేసిన వాళ్లలో నగ్మా కూడా ఒకరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు మొండిచెయ్యే చూపించింది. దీంతో నగ్మాకు మండిపోయింది. ఆమె నేరుగా పార్టీ అధినాయకత్వం మీదే విమర్శలు గుప్పించింది.
తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తానని 2004లో స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకే తాను కాంగ్రెస్లో చేరానని.. ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా తనకు అవకాశం ఇవ్వలేదని.. తాను తక్కువ అర్హత కలిగినదాన్నా అంటూ ఆమె ట్విట్టర్లో నేరుగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రశ్న సంధించారు. 2004లో నగ్మా ముందు బీజేపీలో చేరుతుందని వార్తలొచ్చాయి. కానీ ఆమెకు పదవి ఆశచూపే కాంగ్రెస్లోకి లాగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నగ్మా ఆవేదన సరైందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 30, 2022 11:37 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…