Political News

సోనియా మంచి పనేచేశారా?

కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయిన వారిలో సీనియర్లు, జూనియర్ల మేలు కలయికగా అధినేత్రి సోనియాగాంధీ ఎంపిక చేశారు. సీనియర్లు చిదంబరం, జై రామ్ రమేష్ ఉన్నారు. అలాగే రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్, మాజీ ఎంపీ పప్పూయాదవ్ భార్య రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, ప్రమోద్ తివారి లాంటి వాళ్ళను సోనియా ఎంపికచేశారు. ఇదే సమయంలో ఎంతగా ప్రయత్నించినా సీనియర్లలో అత్యంత ప్రముఖుడైన గులాంనబీ ఆజాద్ కు అవకాశం దొరకలేదు.

ఈ విషయం సోనియా మంచి నిర్ణయమే తీసుకున్నారు. రాజ్యసభ నామినేట్ చేయకపోవటంలో సోనియా నిర్ణయాన్ని పార్టీలోని చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. నిజానికి దశాబ్దాల పాటు ఆజాద్ కాంగ్రెస్ ప్రముఖుడిగా అపరిమితమైన అధికారాలను అనుభవించారు. కేంద్రమంత్రి హోదాలో ఎన్నో రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్నారు. చేసినంత కాలం కేంద్రమంత్రిగా పనిచేసి జమ్మూ-కాశ్మీర్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే కేంద్రమంత్రిగా రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా నామినేట్ అయిపోయారు.

అంటే రాజ్యసభ ఎంపీ అవకాశమైనా, కేంద్రమంత్రి పదవి అయినా, సొంత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా తానే ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో అనేక పదవుల్లో చక్రంతిప్పిన ఆజాద్ ఇపుడు పార్టీలో చాలా లోపాలున్నాయంటు పదే పదే సోనియాకు లేఖలు రాసి సంచలనాలు సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో అధికారంలో బలంగా ఉండి చివరకు బలహీనమైపోవటంలో ఆజాద్ బాధ్యత కూడా ఉంది.  తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిస్సా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్చార్జిగా ఆ రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినటానికి ఆజాద్ కూడా పరోక్షంగా కారకుడే.

ఇపుడు కాంగ్రెస్ అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో నాయకత్వం మార్పు కావాలని బహిరంగంగా రచ్చ చేస్తు సోనియాను బాగా ఇబ్బంది పెడుతున్న ఆజాద్ అంటే పార్టీలోనే బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఆజాద్ ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేయబోతున్నారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. నరేంద్రమోడి దూతలుగా ఇప్పటికే ఆజాద్ ను కొందర కలిశారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆజాద్ పై అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే సోనియా కూడా రాజ్యసభకు దూరం పెట్టేశారు.

This post was last modified on May 30, 2022 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago