తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఏపీలో అధికార వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్పై కాషాయ నేతలు చేస్తున్న పోరాటానికి.. జాతీయ నాయకత్వం కాస్త అధికార బలాన్ని అందించే ఆలోచనలో ఉందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేందుకు.. ఓ నాయకుడిని ఎంపిక చేయాల్సి వస్తే వీరినే పరిశీలిస్తున్నారని పలువురు పేర్లు వినిపించాయి. అయితే, వీరందరికీ షాక్ ఇస్తూ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.
8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నేతల పేర్లు లేవు. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్కు అవకాశం కల్పించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ కంటే తెలంగాణ పై ఎక్కువ చర్చ జరిగింది. అమిత్ షా టూర్ తర్వాత.. తెలంగాణ బీజేపీలో పరిణామాలు, రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయ్.
వచ్చే ఎన్నికల్లో.. అధికారం దక్కించుకోవాలంటే.. మరింత పోరాడాలని జాతీయ నాయకత్వం భావిస్తోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు చేస్తున్న పోరాటానికి.. వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న జాతీయ నాయకత్వం.. ఇక్కడి నాయకులకు కొంత అధికార బలాన్ని కూడా అందించాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఇందుకోసం రాష్ట్రం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని.. పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజ్యసభకు పంపాల్సి వస్తే.. ఎవరిని పంపుతారు? ఏ స్టేట్.. కోటాలో పంపుతారని.. పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలోనేనేతల పేర్లను ఖరారు చేస్తూ వేరే రాష్ట్రలా నాయకుల పేర్లు ఢిల్లీ పెద్దలు విడుదల చేశారు.
తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పడనున్న బీజేపీ అభ్యర్థులు వీరే :
– నిర్మల సీతారామన్, జగ్గేశ్ ( కర్ణాటక )
– పీయూష్ గోయల్, అనిల్ సుఖ్దేవ్ రావ్ బొండే ( మహారాష్ట్ర )
– లక్ష్మికాంత్ వాజ్పేయి, రాధామోహన్ అగర్వాల్, సురేంద్రసింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శణ సింగ్, సింగీతా యాదవ్(ఉత్తరప్రదేశ్)
– సతీష్ చంద్ర, శంభు శరణ్ ( బీహార్ )
– కృష్ణలాల్ ( హర్యానా )
– సుశ్రి కవితా పటిదార్ ( మధ్యప్రదేశ్ )
– గణశ్యామ్ తివారీ ( రాజస్థాన్ )
కల్పనా సైనా ( ఉత్తరాఖండ్ )
This post was last modified on May 30, 2022 9:25 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…