Political News

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ పెద్ద‌ల షాక్‌

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల‌కు ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఏపీలో అధికార వైసీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌పై కాషాయ నేతలు చేస్తున్న పోరాటానికి.. జాతీయ నాయకత్వం కాస్త అధికార బలాన్ని అందించే ఆలోచనలో ఉందని టాక్ వినిపించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేందుకు.. ఓ నాయకుడిని ఎంపిక చేయాల్సి వస్తే వీరినే ప‌రిశీలిస్తున్నార‌ని ప‌లువురు పేర్లు వినిపించాయి. అయితే, వీరంద‌రికీ  షాక్ ఇస్తూ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.

8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నేత‌ల పేర్లు లేవు. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్‌ గోయల్‌కు అవకాశం కల్పించారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ కంటే తెలంగాణ పై ఎక్కువ చ‌ర్చ‌ జ‌రిగింది. అమిత్ షా టూర్ తర్వాత.. తెలంగాణ బీజేపీలో పరిణామాలు, రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయ్.

వచ్చే ఎన్నికల్లో.. అధికారం దక్కించుకోవాలంటే.. మరింత పోరాడాలని జాతీయ నాయకత్వం భావిస్తోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు చేస్తున్న పోరాటానికి.. వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న జాతీయ నాయకత్వం.. ఇక్కడి నాయకులకు కొంత అధికార బలాన్ని కూడా అందించాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఇందుకోసం రాష్ట్రం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నేతల‌ను రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని.. పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజ్యసభకు పంపాల్సి వస్తే.. ఎవరిని పంపుతారు? ఏ స్టేట్.. కోటాలో పంపుతారని.. పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ స‌మ‌యంలోనేనేత‌ల పేర్ల‌ను ఖ‌రారు చేస్తూ వేరే రాష్ట్ర‌లా నాయ‌కుల పేర్లు ఢిల్లీ పెద్ద‌లు విడుద‌ల చేశారు.

తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌నున్న బీజేపీ అభ్యర్థులు వీరే :
– నిర్మల సీతారామన్‌, జగ్గేశ్‌ ( కర్ణాటక )
– పీయూష్‌ గోయల్, అనిల్‌ సుఖ్‌దేవ్‌ రావ్ బొండే  ( మహారాష్ట్ర )
– లక్ష్మికాంత్‌ వాజ్‌పేయి, రాధామోహన్‌ అగర్వాల్, సురేంద్రసింగ్‌ నగర్, బాబురామ్‌ నిషద్, దర్శణ సింగ్‌, సింగీతా యాదవ్‌(ఉత్తరప్రదేశ్‌)
– సతీష్‌ చంద్ర, శంభు శరణ్‌ ( బీహార్‌ )
– కృష్ణలాల్‌ ( హర్యానా )
– సుశ్రి కవితా పటిదార్‌ ( మధ్యప్రదేశ్‌ )
– గణశ్యామ్‌ తివారీ ( రాజస్థాన్‌ )
కల్పనా సైనా ( ఉత్తరాఖండ్‌ )

This post was last modified on May 30, 2022 9:25 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago