Political News

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ పెద్ద‌ల షాక్‌

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల‌కు ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఏపీలో అధికార వైసీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌పై కాషాయ నేతలు చేస్తున్న పోరాటానికి.. జాతీయ నాయకత్వం కాస్త అధికార బలాన్ని అందించే ఆలోచనలో ఉందని టాక్ వినిపించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేందుకు.. ఓ నాయకుడిని ఎంపిక చేయాల్సి వస్తే వీరినే ప‌రిశీలిస్తున్నార‌ని ప‌లువురు పేర్లు వినిపించాయి. అయితే, వీరంద‌రికీ  షాక్ ఇస్తూ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.

8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నేత‌ల పేర్లు లేవు. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్‌ గోయల్‌కు అవకాశం కల్పించారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ కంటే తెలంగాణ పై ఎక్కువ చ‌ర్చ‌ జ‌రిగింది. అమిత్ షా టూర్ తర్వాత.. తెలంగాణ బీజేపీలో పరిణామాలు, రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయ్.

వచ్చే ఎన్నికల్లో.. అధికారం దక్కించుకోవాలంటే.. మరింత పోరాడాలని జాతీయ నాయకత్వం భావిస్తోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు చేస్తున్న పోరాటానికి.. వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న జాతీయ నాయకత్వం.. ఇక్కడి నాయకులకు కొంత అధికార బలాన్ని కూడా అందించాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఇందుకోసం రాష్ట్రం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నేతల‌ను రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని.. పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజ్యసభకు పంపాల్సి వస్తే.. ఎవరిని పంపుతారు? ఏ స్టేట్.. కోటాలో పంపుతారని.. పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ స‌మ‌యంలోనేనేత‌ల పేర్ల‌ను ఖ‌రారు చేస్తూ వేరే రాష్ట్ర‌లా నాయ‌కుల పేర్లు ఢిల్లీ పెద్ద‌లు విడుద‌ల చేశారు.

తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌నున్న బీజేపీ అభ్యర్థులు వీరే :
– నిర్మల సీతారామన్‌, జగ్గేశ్‌ ( కర్ణాటక )
– పీయూష్‌ గోయల్, అనిల్‌ సుఖ్‌దేవ్‌ రావ్ బొండే  ( మహారాష్ట్ర )
– లక్ష్మికాంత్‌ వాజ్‌పేయి, రాధామోహన్‌ అగర్వాల్, సురేంద్రసింగ్‌ నగర్, బాబురామ్‌ నిషద్, దర్శణ సింగ్‌, సింగీతా యాదవ్‌(ఉత్తరప్రదేశ్‌)
– సతీష్‌ చంద్ర, శంభు శరణ్‌ ( బీహార్‌ )
– కృష్ణలాల్‌ ( హర్యానా )
– సుశ్రి కవితా పటిదార్‌ ( మధ్యప్రదేశ్‌ )
– గణశ్యామ్‌ తివారీ ( రాజస్థాన్‌ )
కల్పనా సైనా ( ఉత్తరాఖండ్‌ )

This post was last modified on May 30, 2022 9:25 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

57 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago