Political News

మ‌హానాడులో వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె

టీడీపీ మహానాడులో ఆసక్తికర  పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు అధికార వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో.. వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య.. లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్‌కు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. లోకేష్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టీడీపీ కండువా కప్పుకోవాలని కైవల్యారెడ్డి భావిస్తున్నట్లు తెలియవచ్చింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ టీడీపీ నాయకురాలు విజయమ్మకు కైవల్యారెడ్డి కోడలు. విజయమ్మ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. అయితే కోడలిని కూడా పార్టీలోకి తీసుకురావాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు టికెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. మరి ఆత్మకూరు విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రత్యేక భేటీ అటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇటు వైసీపీలో చర్చనీయాంశమైంది. ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ కేబినెట్‌లో విస్తరణలో రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే ఆయనకు పదవి దక్కలేదు కానీ.. అదే సామాజిక వర్గానికి, అదే జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో అప్పట్నుంచి ఆనం కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా తెలియవచ్చింది.

ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆయన కుమార్తె టీడీపీ మహానాడులో ప్రత్యక్షమవ్వడం, పైగా లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం పలు చర్చలకు దారితీసింది. అయితే ఈ విషయం తెలియగానే వైసీపీ అధిష్టానం నుంచి ఆనంకు ఫోన్ కాల్ కూడా వెళ్లిందని సమాచారం. ఈ భేటీపై ఇంతవరకూ ఆనం కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కాగా వైసీపీలోకి రాకమునపు ఆనం కుటుంబం టీడీపీలోనే ఉండేది. ఈ కుటుంబం నుంచి ఆనం వెంకటరమణారెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో కైవ‌ల్యారెడ్డి పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నార‌నే సంకేతాలు బ‌ల‌ప‌డుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 28, 2022 11:00 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

5 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

6 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

10 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago