Political News

మ‌హానాడులో వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె

టీడీపీ మహానాడులో ఆసక్తికర  పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు అధికార వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో.. వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య.. లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్‌కు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. లోకేష్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టీడీపీ కండువా కప్పుకోవాలని కైవల్యారెడ్డి భావిస్తున్నట్లు తెలియవచ్చింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ టీడీపీ నాయకురాలు విజయమ్మకు కైవల్యారెడ్డి కోడలు. విజయమ్మ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. అయితే కోడలిని కూడా పార్టీలోకి తీసుకురావాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు టికెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. మరి ఆత్మకూరు విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రత్యేక భేటీ అటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇటు వైసీపీలో చర్చనీయాంశమైంది. ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ కేబినెట్‌లో విస్తరణలో రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే ఆయనకు పదవి దక్కలేదు కానీ.. అదే సామాజిక వర్గానికి, అదే జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో అప్పట్నుంచి ఆనం కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా తెలియవచ్చింది.

ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆయన కుమార్తె టీడీపీ మహానాడులో ప్రత్యక్షమవ్వడం, పైగా లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం పలు చర్చలకు దారితీసింది. అయితే ఈ విషయం తెలియగానే వైసీపీ అధిష్టానం నుంచి ఆనంకు ఫోన్ కాల్ కూడా వెళ్లిందని సమాచారం. ఈ భేటీపై ఇంతవరకూ ఆనం కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కాగా వైసీపీలోకి రాకమునపు ఆనం కుటుంబం టీడీపీలోనే ఉండేది. ఈ కుటుంబం నుంచి ఆనం వెంకటరమణారెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో కైవ‌ల్యారెడ్డి పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నార‌నే సంకేతాలు బ‌ల‌ప‌డుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 28, 2022 11:00 pm

Share

Recent Posts

మరో రెండు నెలల్లో భారత నావికుడి పెళ్లి.. ఈలోపే…

రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…

1 hour ago

ఒకేరోజు రెండు వయసు వ్యత్యాసం సినిమాలు

1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…

2 hours ago

ఈ బౌలింగ్ తో వరల్డ్ కప్ అంటే కష్టమే…

ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…

2 hours ago

రాజమౌళి డైవర్షన్… వంగా డైరెక్ట్ ఎటాక్

సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…

3 hours ago

టీడీపీ లో ఇలా అయితే.. మ‌ళ్లీ బ్యాడైపోతారు… !

టీడీపీ ని నిలబెట్టింది కార్య‌క‌ర్త‌లు.. వారి అండ‌తోనే పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ జాతీయ…

3 hours ago

‘మోడీ చెప్పే నీతులు ఆయనకు వర్తించవా?’

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా అనేక వ్యాఖ్య‌లు వెల్లువెత్తుతున్నాయి. అంద‌రి టార్గెట్ ఒక్క‌టే..…

4 hours ago