ఇపుడిదే విషయం పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. పనిలోపనిగా మహానాడులో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ ఎంపీ కేశినేని నానికి పోటీగా సొంత తమ్ముడు కేశినేని చిన్ని పార్టీలో హైలైట్ అవుతున్నారు. ఈయన కొంతకాలంగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు తన ఫొటోలను మాత్రమే చిన్ని పెట్టారు. స్వయానా సోదరుడైనా నాని ఫొటో మాత్రం కనబడలేదు.
ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్ తో చిన్ని రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎంపీ నానితో పార్టీలోని అంటే విజయవాడలోని చాలామంది నేతలకు ఏ మాత్రం పడటం లేదు. ముఖ్యంగా దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా లాంటి సీనియర్ నేతలతో ఎంపీకి ఏ మాత్రం పొసగటం లేదు. వీళ్ళ మధ్య ఆధిపత్యం గొడవల కారణంగా పార్టీ పరువు బజారున పడింది. వీళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
వీళ్ళ మధ్య గొడవలను సెటిల్ చేయలేక చంద్రబాబు కూడా ఈ గ్రూపులను వదిలేశారు. దాంతో ఎంపీకి వ్యతిరేకంగా పై నేతలదే పై చేయిగా వ్యవహారాలు సాగుతోంది. దాంతో ఎంపీకి తీవ్ర ఆగ్రహం వచ్చింది. దాంతో అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అదునుగా నాని సోదరుడు చిన్నిని పార్టీ నేతలు దువ్వుతున్నారు. దాంతో చిన్ని కూడా పార్టీలో యాక్టివ్ అయిపోయారు. దీనికి సాక్ష్యమే ఎంపీ మహానాడుకు గైర్హాజరవటం. ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు హాజరుకాకుండా ఎంపీ ఢిల్లీలో కూర్చున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా స్థిరపడిన చిన్నినే ఎంకరేజ్ చేయటం వల్ల పార్టీకి బాగా లాభం ఉంటుందని పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్ కు చెప్పారట. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చిన్ని ఏదో ఒక నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయటమో లేకపోతే ఎంపీగా పోటీ చేయటమో ఖాయమనే అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.
This post was last modified on May 28, 2022 10:14 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…