Political News

కుంభ‌కోణాలు బ‌య‌ట పెడ‌తా: నారా లోకేశ్

పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని లోకేశ్ చెప్పారు. మహానాడు తరువాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నట్లు వెల్లడించారు. మహానాడు సందర్భంగా లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు.

మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడినవారికి ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు  నారా లోకేశ్ అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని వివరించారు. మహానాడులో జరుగుతున్న చర్చలపై మీడియాతో లోకేశ్‌ మాట్లాడారు. పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టానని వెల్లడించారు. ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని వివరించారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఈలోగా కొంతమంది అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేస్తాం. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని భావిస్తున్నా. పనిచేయని నేతలకు, ఇన్‌ఛార్జ్‌లకు అవకాశాలుండవు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులు తిరిగి ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడితే గెలిచే పరిస్థితి ఉంది. పార్టీ అధికారంలోకి రాగానే కీలక మార్పులు తీసుకొస్తాం. మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. పార్టీ అనుబంధ విభాగాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. పార్టీకి.. ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం.. అని లోకేశ్ వివ‌రించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశానన్న లోకేశ్‌.. ఈసారి వేరొకరికి అవకాశం కల్పిస్తానన్నారు. ఈ తరహాలోనే పార్టీలో 2+1 విధానం రావాలన్నారు. రెండు పర్యాయాలు వరుసగా ఒక పదవిలో ఉన్నవారికి విరామం ఇవ్వాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు. 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థుల్ని నియమించాల్సి ఉందన్నారు. మహానాడు తరువాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నానని లోకేశ్ వెల్లడించారు. డబ్బుతోనే రాజకీయం చేయలేమన్న ఆయన.. డబ్బు లేకున్నా కష్టమన్నారు.

This post was last modified on May 27, 2022 8:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

3 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

6 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

7 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

11 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

12 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

12 hours ago