ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో నేటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్కు ఒక తీర్మానం చొప్పున మెుత్తం 17 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్రధానంగా.. ప్రజలు పడుతున్న కష్టాలు.. ప్రభుత్వ భారాలు.. చెత్తపై పన్ను.. రైతులకు విద్యుత్ మీటర్లు.. ఉద్యోగాలు లేకపోవడం.. మహిళలపై జరుగుతున్న దాడులు.. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు వంటి అనేక అంశాలను పొందుపరిచారు.
ఒంగోలులో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. నేటి నుంచి ఒంగోలులో టీడీపీ మహానాడు జరగనున్న నేపథ్యంలో పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు తీర్మానాలకు పొలిట్బ్యూరో ఆమోదం తెలిపింది. ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 17 తీర్మానాలు చేశారు.
వీటిలో ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్కు ఒక తీర్మానం ఉంది. రాజకీయ తీర్మానంపై పొలిట్ బ్యూరో లో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ బస్సు యాత్రపై పొలిట్ బ్యూరోలో ప్రస్తావన వచ్చింది. బస్సు యాత్ర ఓ డ్రామా అంటూ చర్చ జరిగింది.
వైసీపీ 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రెడ్డి వర్గం వారేనని నేతలు గుర్తుచేశారు. లాబీయింగ్ చేసేవారికి రాజ్యసభ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవట్లేదని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ఈ భేటీలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కళా వెంకట్రావు ప్రస్తావించారు. ఎంబీసీ నుంచి కొత్తవారికి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు.
This post was last modified on May 27, 2022 7:38 pm
ఈ మధ్య కాలంలో భారతీయ ప్రేక్షకులను బాగా కదిలించి.. తీవ్ర భావోద్వేగానికి గురి చేసిన సినిమా అంటే.. ‘చావా’ అనే…
ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలైన వెంటనే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే కూటమి పాలన మొదలయ్యాక...…
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవానికి…
నటుడు, నిర్మాత, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఇప్పట్లలో బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే ఏపీలో పర్యటించనున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి న తర్వాత..ఏపీపై ప్రత్యేక ప్రేమ…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.…