నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ మార్గంలోని ఉజ్వల్ భారత్ సాధించాలన్న కోరిక కేసీయార్ లో బలంగా ఉంది. అయితే ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే కీలకమైన పాయింట్. కారణం ఏమిటంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అంటేనే జరిగే పని కాదన్న విషయం అందరికీ తెలుసు. ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలను దూరంగా పెట్టి జాతీయ స్ధాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయటం సాధ్యమయ్యే పని కాదు.
మూడో కూటమిని ఎవరు తీసుకురావాలన్నా కచ్చితంగా పై రెండు కూటమిలోని ఏదో ఒకదాని మద్దతు లేకుండా జాతీయ రాజకీయాలు నడపటం జరిగే పని కాదు. దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉన్న కేసీయార్ కు ఇంత చిన్న విషయం అర్థం కాకపోవడమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ ను దూరం పెట్టి జాతీయ రాజకీయాల్లో ఎన్డీయేకి వ్యతిరేకంగా రాజకీయం చేయటం సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పినా కేసీయార్ చెవికెక్కలేదు.
అందుకనే కేసీయార్ ప్రయత్నాలను ఆ మధ్య ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. దాంతో తనకు ఎవరూ మద్దతివ్వడం లేదన్న విషయాన్ని గ్రహించి కేసీయార్ కూడా కామ్ గా ఉండిపోయారు. అయితే కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాక్టివ్ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ఢిల్లీలో కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, బెంగుళూరులో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ అయ్యారు. ఉజ్వల్ భారత్ సాధనే తన టార్గెట్ గా చెప్పుకుంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే తన బలాన్ని కేసీయార్ వాస్తవానికి మించి చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలే క్రెడిబులిటి తక్కువ దానికి తోడు ఒంటెత్తు పోకడ తో వెళుతున్నారు. ఈ కారణంతోనే నాన్ కాంగ్రెస్ సీఎంలు పెద్దగా సానుకూలంగా ఉన్నట్లులేరు. ఈ నేపధ్యంలోనే మూడునెలల్లో సంచలనాలు చూస్తారు, సంచలన వార్తచెబుతా అంటు కొత్తరాగం మొదలుపెట్టారు. మరిది ఎంతవరకు వర్కవుటవుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on May 27, 2022 1:49 pm
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…