Political News

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికే: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. తొలుత ఉండవల్లిలోని నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిన బాబు.. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడుకు ర్యాలీగా బయల్దేరిన ఆయన మార్గం మధ్యలో చిలకలూరిపేట వద్ద టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని ఈ సంద‌ర్భంగా చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. “1994లో కూడా ఇంత ఉత్సాహం లేదు. కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. పార్టీ నాయకులను వేధించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వీటన్నింటికీ భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం. ఎంతో మంది సీఎంలను చూశాను. ఇలాంటి పనికిమాలిన చిల్లర ముఖ్యమంత్రిని చూడలేదు. నిన్న ఓ మంత్రి మహానాడును తాము అడ్డుకోవడం లేదని చెప్పారు. మీరు ఆపితే మహానాడు ఆగుతుందా? ఒంగోలులో సభకు గ్రౌండ్‌ ఇవ్వరా?“ అని నిప్పులు చెరిగారు.

వైసీపీకి ఊడిగం చేసే అధికారుల భరతం పడతామ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “టీడీపీ ఫ్లెక్సీలు చించేస్తారా? నాకు కోపం వస్తే ఎవరినీ వదిలిపెట్టను. మర్యాదగా మీరుంటే నేనూ మర్యాదగా ఉంటా. పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం. మహానాడు ఓ ప్రభంజనం. ఎక్కడికక్కడ కట్టలు తెంచుకొని మహానాడుకు రండి. మీకు నేను అండగా ఉంటాను. ఈ మహానాడు ద్వారా క్విట్‌ జగన్‌.. సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు పిలుపిద్దాం. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. రాష్ట్రంలో ఏ వర్గమూ బాగాలేదు.“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం

చిలకలూరిపేట నుంచి బయలుదేరి యడ్లపాడు వంకాయపాడు చేరుకున్న చంద్రబాబు ర్యాలీకి పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మహానాడుకు వెళ్లే వారి కోసం వంకాయలపాడులో చేసిన ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలించారు. ‘అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే. అమలాపురంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులే తగులబెట్టారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారు. వాళ్లే తగలబెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారు. ప్రతిపక్షాలపై తోయడం జగన్‌కు అలవాటుగా మారింది.“ అని వ్యాఖ్యానించారు..

“జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తా. ఆర్టీసీ బస్సులకు డ‌బ్బులు కడతామన్నా బస్సులు ఇవ్వరా?. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను భయపెడుతున్నారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఏం చెప్పాలని బస్సు యాత్ర చేపడుతున్నారు. ఎస్సీలకు చెందిన 28 పథకాలు రద్దు చేశారు. డ్రైవర్‌ను అనంతబాబు చంపేస్తే.. కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు’ అని చంద్రబాబు ధ్వజ మెత్తారు.

ప్రభుత్వం ఎన్నిఅడ్డంకులు సృష్టించినా.. కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, మహానాడు దిగ్విజయం అవుతుందని పార్టీ నేతలు అన్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒంగోలు చేరుకుంటున్నారు. అధినేత చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. వందల సంఖ్యలో వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరించాయి. ఇవాళ సాయంత్రం ఒంగోలులో పార్టీ పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించనున్నారు.

This post was last modified on May 26, 2022 5:59 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప‌వ‌న్‌కు రిలీఫ్… చంద్ర‌బాబుకు తిప్పలు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు  ఎన్నిక‌ల గుర్తుల కేటాయింపు విష‌యంలో కొంత రిలీఫ్ ద‌క్కింది. కానీ, ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీల…

2 hours ago

రజనీకాంత్ బయోపిక్ హీరో ఎవరబ్బా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…

2 hours ago

విజయ్ దేవరకొండ.. సీమ డైలాగ్స్

వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…

3 hours ago

న‌వ‌ర‌త్నాలు స‌రే.. న‌వ సందేహాలున్నాయ్..?

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల లేఖ సంధించారు. దీని లో…

3 hours ago

50 వసంతాల ‘అల్లూరి సీతారామరాజు’

టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…

4 hours ago

మణికర్ణిక పరిస్థితే వీరమల్లుకు వస్తే

గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…

5 hours ago