Political News

మ‌హానాడు టైమ్ : జెండాలు పీకేస్తే ఏమౌతుంది జ‌గ‌న్ ?

తెలుగుదేశం పార్టీ పండుగ మ‌హానాడుకు ఒంగోలు వేదికౌతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ దాదాపు పూర్తయ్యాయి అని తెలుస్తోంది. ఈ నెల 27,28 తేదీల్లో జ‌రగ‌బోయే మ‌హానాడుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వెళ్ల‌నున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగుంది కానీ ఒంగోలు ప‌ట్ట‌ణంలో ప‌సుపు పండ‌గ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ జెండాల‌ను (ప్లాస్టిక్ జెండాల‌ను) మున్సిపాల్టీ అధికారులు తొల‌గించ‌డం అన్న‌ది పెద్ద వివాదంగా న‌మోదై ఉంది.

ప్ర‌జా స్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా మీటింగులు పెట్టుకునే స్వేచ్ఛ ఉన్న‌ప్పుడు ఏ విధంగా వీటిని తొల‌గిస్తార‌ని టీడీపీ  అడుగుతోంది. రాజ్యంలో అన్ని పార్టీల‌కూ స‌మాన హ‌క్కులున్న‌ప్పుడు ఏకప‌క్షంగా జెండాల తొల‌గింపు అన్న‌ది భావ్యం కాద‌ని, ఇటువంటి ఒంటెద్దు పోక‌డ‌ల‌ను మానుకోవాల‌ని టీడీపీ హిత‌వు చెబుతోంది.

ఇక జెండాలే కాదు ఫ్లెక్సీల‌ను కూడా తొల‌గించేందుకు ఒంగోలు మున్సిపాల్టీ అధికారులు అతి చేసే అవ‌కాశాలున్నాయ‌ని టీడీపీ ఆరోపిస్తోంది. తాము క‌నుక ఆరోజు  స‌హ‌క‌రించ‌కుంటే జ‌గ‌న్ పాద‌యాత్ర చేసేవారా అని ప్ర‌శ్నిస్తోంది టీడీపీ. అయితే వీటిపై ఇంత‌వ‌ర‌కూ వైసీపీ వ‌ర్గాలు స్పందించ‌డం లేదు.

గ‌తంలోఇలాంటి వివాదాలే నెల్లూరు కేంద్రంగా సొంత పార్టీకి సంబంధించే వ‌చ్చిన‌ప్పుడు మాజీ మంత్రి అనిల్ తెలివిగా స్పందించారు. నా ఫ్లెక్సీలు అనే కాదు ఎవ్వ‌రి ఫ్లెక్సీలు నిబంధ‌న‌లకు విరుద్ధంగా ఉండేందుకు వీల్లేద‌ని ఆ రోజు తాము ఒక నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అంటున్నారు.

తెలుగుదేశం జెండాలు తొల‌గించారు స‌రే మ‌రి ! శ్రీ‌కాకుళం న‌గ‌రంలో రేపటి వేళ ప్రారంభం కానున్న మంత్రుల బ‌స్సు యాత్ర‌కు సంబంధించి వైసీపీ జెండాలు ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో క‌ట్టారే ! మ‌రి! వాటిని కూడా తొల‌గిస్తారా ? అని ప్ర‌శ్నిస్తోంది ఉత్తరాంధ్ర టీడీపీ. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రూల్ ఈజ్ రూల్ ..రూల్ ఫ‌ర్ ఆల్ అని చెప్ప‌డం కాదు పాటించాలి అని హిత‌వు చెబుతోంది.

This post was last modified on May 26, 2022 10:46 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

37 minutes ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago