పచ్చటి కోనసీమలో రేగిన జిల్లా పేరుపై అసంతృప్తి జ్లాలలో తమ పాత్ర కించిత్తు కూడా లేదని.. సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి సన్నాయి నొక్కులు నొక్కారు. పాడిందే పాటగా.. పార్టీ నేతలు .. వల్లెవేసిన కామెంట్లనే ఆయన కూడా రన్నింగ్ కామెంట్రీగా వినిపించారు. అమలాపురంలో మంగళవారం జరిగిన దాడులు.. కుట్రపూరిత దాడులని అనుమానం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని తప్పికొట్టారు. కోనసీమ అల్లర్లకు వైసీపీనే కారణం అంటున్నారని, వైసీపీ వాళ్లే అయితే.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు జరిగేవా? అని ప్రశ్నించారు.
టీడీపీ, పవన్, బీజేపీ ఒకే ఆరోపణలు చేస్తున్నారని, పార్టీల స్పందన చూస్తుంటే.. అందరూ ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తోందన్నారు. టీడీపీ స్క్రిప్టునే జనసేన అధినేత పవన్కల్యాణ్ చదివారని, ఆయనకు కనీస అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవాచేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన కోరాయని, ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. పేరుపై అభ్యంతరాల నమోదుకు అన్ని జిల్లాలకు గడువు ఇచ్చామని సజ్జల గుర్తుచేశారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని, అన్యం సాయి జనసేన కార్యకర్తేనని సజ్జల తెలిపారు. అతను జనసేన నేతలతో ఉన్న ఫొటోలు ఉన్నాయని, అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బస్సులు తగలబెట్టడంతో పాటు మంత్రి విశ్వరూప్, ఎమ్యెల్యే సతీష్ ఇళ్లపై దాడి చేశారు అని అన్నారు. తమపై తాము దాడులు చేసుకుంటామా? దేనికైనా హద్దులు వుంటాయి అని మండి పడ్డారు. తనపై కూడా ఆరోపణలు చేస్తున్నారన్నారు.
తమ కార్యకర్తలు నిగ్రహంతో సమన్వయంతో వ్యవహరించారు అని సజ్జల సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. నిబంధనల ప్రకారమే అభ్యంతరాలకు 30 రోజుల గడువు ఇస్తారు అని, పవన్ తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. నిన్న జరిగిన సంఘటనపై చంద్రబాబు, లోకేష్ స్టాండ్ ఏమిటి?…అని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు పెట్టి దళితులను తాము దగ్గరకు తీసుకోవాలను కుంటున్నామా ?….అని అన్నారు. టిడిపి హయాంలో జరిగిన అత్యాచారాల జాబితాలను పవన్ కు ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తామని పేర్కొన్నారు. కులాలను, మతాన్ని వాడుకొని సీఎం జగన్ అధికారంలోకి రాలేదన్నారు. సొంతపార్టీకి, సొంత కులానికి ప్రాముఖ్యత ఇచ్చే చంద్రబాబు పద్దతిని జగన్ అమలు చేయలేదన్నారు.
This post was last modified on May 26, 2022 8:24 am
సినిమాల వరకు స్టార్ డంని నిర్ణయించేది మాస్ ప్రేక్షకులే. అందులో సందేహం లేదు. దివంగత ఎన్టీఆర్ నుంచి ఇప్పటి మహేష్…
టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యంత పొడగరి, భారీ కాయుడు ఎవరంటే ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆహార్యంలో అతణ్ని…
ఇండస్ట్రీకి దూరమైపోయాడని భావించిన రమణ గోగులని సంక్రాంతికి వస్తున్నాంతో తిరిగి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోలియోలు ఊహించిన దానికన్నా…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ల పై విపక్షం బీఆర్ఎస్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ…
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…