Political News

ఏపీ స‌ర్కారుపై మాజీ ఐపీఎస్ ధ్వ‌జం

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ఎక్క‌డిక‌క్క‌డ అధికార పార్టీ నేత‌లు చెల‌రేగుతున్న ప‌రిస్థితిపై.. పొరు గు రాష్ట్రాల‌నుంచి ఇప్ప‌టికే అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రువ‌వుతున్నాయ ని మేధావులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు, ఎస్సీల‌కు ఏపీలో ర‌క్ష‌ణ లేద‌ని.. ఇప్ప‌టికే ద‌ళిత సంఘాలు ఆందోళ‌నకు దిగిన విష‌యం తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం వీటికి విప‌క్ష నేత‌ల విమ‌ర్శ‌ల ఖాతాల్లోకి నెట్టేస్తోంది. పైగా..నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే.. ఇప్పుడు తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీలోనూ గ‌తంలో ప‌నిచేసిన ఎం. నాగేశ్వ‌ర‌రావు.. ఏపీ స‌ర్కారు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ముఖ్యంగా కోన‌సీమ‌లో తాజాగా జ‌రిగిన అల‌జ‌డి.. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు త‌గ‌ల‌బెట్టిన ఘ‌ట‌న‌.. ఈ ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌కు గాయాలు కావ‌డం.. వీటిని ప్ర‌భుత్వం .. ఓ వ‌ర్గంపై నెట్టేయాల‌ని చూడ‌డం వంటి విష‌యాలు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న నేప‌థ్యంలో ఐపీఎస్ అధికారి నాగేశ్వ‌ర‌రావు చిత్రంగా రియాక్ట్ అయ్యారు. అది కూడాముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి నేరుగా ఆయ‌న వ్యాఖ్య‌లు సంధించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పేరును `వైఎస్సార్ రాష్ట్రం`గా పేరు మార్చాల‌ని ఆయ‌న జ‌గ‌న్‌కు సూచించారు.

అదేస‌మ‌యంలో ఆయ‌న మ‌రో వ్యాఖ్య కూడా చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం దాదాపు తెలుగు మీడియంను ఎత్తేస్తున్న నేప‌థ్యంలో దీనిపైనా స‌టైర్ వేశారు. “తెలుగును ఎలాగూ తెగులుగా భావిస్తున్నాం.. కాబ‌ట్టి.. వైఎస్ ఆర్ రాష్ట్రాన్ని `వైఎస్సార్ ల్యాండ్‌`గా పేర్కొనండి అంటూ.. నాగేశ్వ‌ర‌రావు స‌ల‌హా ఇచ్చారు. మొత్తానికి ప్ర‌భుత్వ వైఖ‌రిపై అటు.. ఉన్న‌తాధికారుల్లోనూ.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీటిపై ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

This post was last modified on May 25, 2022 7:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago