రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు చెలరేగుతున్న పరిస్థితిపై.. పొరు గు రాష్ట్రాలనుంచి ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువవుతున్నాయ ని మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు, ఎస్సీలకు ఏపీలో రక్షణ లేదని.. ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ.. ప్రభుత్వం వీటికి విపక్ష నేతల విమర్శల ఖాతాల్లోకి నెట్టేస్తోంది. పైగా..నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అయితే.. ఇప్పుడు తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీలోనూ గతంలో పనిచేసిన ఎం. నాగేశ్వరరావు.. ఏపీ సర్కారు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ముఖ్యంగా కోనసీమలో తాజాగా జరిగిన అలజడి.. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టిన ఘటన.. ఈ ఘటనల్లో పోలీసులకు గాయాలు కావడం.. వీటిని ప్రభుత్వం .. ఓ వర్గంపై నెట్టేయాలని చూడడం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు చిత్రంగా రియాక్ట్ అయ్యారు. అది కూడాముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి నేరుగా ఆయన వ్యాఖ్యలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును `వైఎస్సార్ రాష్ట్రం`గా పేరు మార్చాలని ఆయన జగన్కు సూచించారు.
అదేసమయంలో ఆయన మరో వ్యాఖ్య కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తెలుగు మీడియంను ఎత్తేస్తున్న నేపథ్యంలో దీనిపైనా సటైర్ వేశారు. “తెలుగును ఎలాగూ తెగులుగా భావిస్తున్నాం.. కాబట్టి.. వైఎస్ ఆర్ రాష్ట్రాన్ని `వైఎస్సార్ ల్యాండ్`గా పేర్కొనండి అంటూ.. నాగేశ్వరరావు సలహా ఇచ్చారు. మొత్తానికి ప్రభుత్వ వైఖరిపై అటు.. ఉన్నతాధికారుల్లోనూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండడం గమనార్హం. మరి వీటిపై ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 25, 2022 7:19 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…