Political News

వైసీపీ కాన్ఫిడెన్స్ ఆ 70 సీట్ల‌కే.. ప‌రిమిత‌మా!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు, న‌డుస్తున్న ప‌రిణామాల‌కూ మధ్య పొంత‌న అయితే ఉంది. పొత్తులు లేదా ఒప్పందాలు అన్న‌వి ఇప్ప‌టికిప్పుడు తేలేవి కావు. కానీ జ‌న‌సేనాని ఎక్క‌డ పోటీ చేసినా ఓడిస్తామ‌ని చెప్ప‌డంతో వైసీపీ మ‌రింత వివాదాన్ని పెంచింది. ఓ నాయ‌కుడు గెలిచినా, ఓడినా జ‌గ‌న్ ఇమేజ్ ఏమీ పెరిగిపోదు కానీ, ప‌వ‌న్ లాంటి లీడ‌ర్ల‌ను ఓడిస్తే మాత్రం ఆయ‌నకు ఓ విధంగా ప్ల‌స్ కానుంది. మాట్లాడే నాయ‌కులలో కొంద‌రు మ‌రీ అతిగా స్పందిస్తున్నా, జ‌నసేన వాటిని తిప్పికొడుతుంది.

కానీ ఒక‌వేళ జ‌న‌సేన వ‌చ్చేసారి కూడా ఓడిపోతే అప్పుడు వైసీపీ ఇంకొంత బ‌ల‌ప‌డ‌డం ఖాయం. అయినా గెలుపా ఓట‌మా అన్న‌వి ప‌వ‌న్ ప‌ట్టించుకోడు క‌నుక వైసీపీ కూడా కాస్త జాగ్ర‌త్త‌గానే మాట్లాడితే బెట‌ర్ అని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇప్ప‌టికిప్పుడు బీజేపీ బీజియంతో టీడీపీ గొంతు క‌ల‌ప‌దు అని తేలిపోయింది. క‌నుక బీజేపీ ని ఒంట‌రి చేసి జ‌న‌సేన టీడీపీతో క‌లిసే ఛాన్స్ ఉంద‌ని ఉండ‌వ‌ల్లి లాంటి వెట్ర‌న్ పొలిటీషియ‌న్లు అంటున్నారు.

ఒక‌వేళ అదే క‌నుక జ‌రిగితే 2014 నాటి రిజ‌ల్ట్  రిపీట్ కావొచ్చు. పొత్తుల్లో భాగంగా ప‌వ‌న్ మ‌నుషుల‌ను గెలిపించాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుదే! ఆ విధంగా చంద్ర‌బాబు న‌డుచుకోక‌పోతే న‌ష్టం టీడీపీకే ! అందుకే వైసీపీ కి మ‌ళ్లీ ఓ 70 సీట్లు రావ‌డం ఖాయం. అంతేకానీ ఓ మీడియా బాకాలు ఊదుతున్న విధంగా యాభై ఒక్క శాతం ఓట‌ర్లు వైసీపీ వైపే ఉన్నారు అన్న‌ది ఓ అబ‌ద్ధం. ఎందుకంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా మాట్లాడ‌డం కూడా త‌ప్పే ! అని అంటోంది టీడీపీ.

త‌మ కార‌ణంగానే చంద్ర‌బాబు మన‌సు  మారి, కుప్పంలో ఇల్లు క‌ట్టుకుంటున్నార‌ని, త‌మ కార‌ణంగానే బీసీల‌ను చంద్ర‌బాబు నెత్తిన  పెట్టుకుంటున్నార‌ని, త‌మ కార‌ణంగానే లోకేశ్ కూడా ప్ర‌జా పోరాటాల‌కు సై అంటున్నారు అని వైసీపీ అంటోంది. బాగుంది. అంటే ఓ విధంగా తాము బ‌ల‌ప‌డేందుకు ఉన్న అవ‌కాశాల‌న్నింటినీ మెరుగుప‌రుస్తున్న‌ది మీరే అన్న మాట అని టీడీపీ నాయ‌కులు వైసీపీని ఉద్దేశించి అంటున్నాయి. ఈ ద‌శ‌లో బాబు అలానే ఉండిపోక బ‌స్సు యాత్ర చేస్తే బాగుంటుంది. అది కూడా మంత్రుల బ‌స్సు యాత్ర‌కు దీటుగా ఓ టూర్ వేస్తే బాగుంటుంది అని కూడా ఓ వాద‌న వినిపిస్తోంది.

కానీ వ‌య‌స్సు రీత్యా చంద్ర‌బాబు ఎండ‌ల్లో తిరగ‌లేరేమో అన్న మాట కూడా వినిపిస్తుంది. ఏదేమ‌యినా టీడీపీ, జ‌నసేన క‌లిస్తే వైసీపీ విజ‌యావ‌కాశాలు త‌గ్గిపోవ‌డం ఖాయం. అదేవిధంగా సామాజిక న్యాయ భేరి పేరిట జ‌రిగే బ‌స్సు యాత్ర‌కు పోటీగా టీడీపీ క‌నుక జ‌నంలోకి వెళ్తే ఇంకాస్త మంచి ఫ‌లితాలు కూడా ద‌క్కుతాయి అని పార్టీ అభిమానులు చెబుతున్నారు. క‌నుక పొత్తుల విష‌య‌మై టీడీపీ వేగంగా  తేల్చుకుంటే వైసీపీ వేగాన్ని నిలువ‌రించ‌డం అసాధ్యం అయితే కాదు.

This post was last modified on May 25, 2022 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

24 minutes ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

43 minutes ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

55 minutes ago

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

2 hours ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

2 hours ago