Political News

కేటీఆర్ కాబోయే ప్ర‌ధాని: దావోస్‌లో ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఇంకో 20 ఏళ్లలో కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఆశా జడేజా మెత్వాణీ వ్యాఖ్యానించారు. సుస్పష్టమైన లక్ష్యం, దానిని అర్థంచేసుకునేలా వ్యక్తీకరించగల నేర్పు ఉన్న ఇలాంటి యువ రాజకీయనాయకుడిని తాను చూడలేదని ఆమె పొగిడారు. తెలంగాణ బృందం అద్భుతంగా రాణిస్తోందని ఆమె మెచ్చుకున్నారు. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులను గుర్తుచేశారని ప్రస్తావించారు. భవిష్యత్‌లో బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

వాక్చాతుర్యంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయగల నేర్పు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు రాష్ట్రాల్లో చక్కటి వాగ్దాటి కలిగిన అతికొద్ది మంది రాజకీయ నేతల్లో ఆయన కూడా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయ ప్రసంగాలే కాకుండా ఎన్నో అంతర్జాతీయ స్థాయి వ్యాపార, వాణిజ్య సదస్సుల్లోనూ ప్రసంగించి తనదైన శైలిలో ఫిదా చేశారు. తాజాగా మరో అంతర్జాతీయ వేదికపై తన ప్రసంగానికి ఎంతటి ఆకర్షణీయత ఉందో ఆయన చాటిచెప్పుకున్నారు.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ సారధ్యంలోని తెలంగాణ బృందం దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లతో వరుస సమావేశాలు, రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూల పరిస్థితులను ఇన్వెస్టర్లకు వివరించడంలో మంత్రి కేటీఆర్ బృందం తన కార్యదక్షతను చాటుకుంటోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. స్పష్టమైన లక్ష్యంతో కూడిన తన ఆలోచనను ఇన్వెస్టర్లకు తెలియజేయడంతో సఫలీకృతమవుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పనితీరుని గమనించిన ఆశా జడేజా మెత్వాణీ అనే ఓ ఏంజెల్ ఇన్వెస్టర్ నుంచి ఆయనకు గుర్తుండిపోయే ప్రశంస ఇచ్చారు.

This post was last modified on May 25, 2022 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago