Political News

డ్రైవ‌ర్‌ను హ‌త్య చేసి.. శ‌వాన్ని చిత‌క‌బాదాడా?


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామన్నారు. హత్య ఘటన వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన.. తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

హత్య ఘటనపై డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగింటినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించామని.., నిందితుడు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతబాబును విచారించి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఎస్పీ చెప్పిన వివ‌రాలు..

“ఈనెల 19న డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. శ్రీరామ్‌నగర్‌లో మిత్రులతో కలిసి రాత్రివేళ సుబ్రహ్మణ్యం మద్యం తాగాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చారు. సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటివైపు కారులో వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు రుణం ఇచ్చారు. అందులో కొంత తిరిగి చెల్లించాడు సుబ్రహ్మణ్యం. మిగిలిన రుణం చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పద్ధతి మార్చుకోవాలని సుబ్రహ్మణ్యానికి అనంతబాబు చెప్పాడు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తిరగబడేసరికి అనంతబాబు నెట్టారు. అనంతబాబు నెడితే సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది. సుబ్రహ్మణ్యం లేచి మళ్లీ అనంతబాబు మీదకు వచ్చాడు. దీంతో.. అనంతబాబు మళ్లీ వెనక్కి నెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న గ్రిల్‌ తగిలి సుబ్రహ్మణ్యం తలకు మళ్లీ గాయమైంది. గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి కారులో తీసుకెళ్లాడు. కారులో తరలిస్తుండగా సుబ్రహ్మణ్యానికి శ్వాస రావట్లేదని గమనించాడు. సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు అనంతబాబు భావించాడు.” అని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు.

ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు శ‌వాన్ని కొట్టాడా?!

శ్రీరామ్‎నగర్ శంకర్ టవర్ వద్ద అనంతబాబు, సుబ్రహ్మణ్యం మధ్య ఘర్షణ జరిగిందని.. తోపులాటలో ఐరన్ రాడ్ తగిలి సుబ్రహ్మణ్యంకు బలమైన గాయమైందని అనంత‌బాబు చెప్పిన‌ట్టు ఎస్పీ తెలిపారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో సుబ్రహ్మణ్యం శ్వాస ఆగిపోయిందని చెప్పారు. సుబ్రహ్మణ్యం మృతి చెందటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు అనంతబాబు చిత్రీకరించడానికి ప్రయత్నించాడని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించాలంటే.. బాడీలో అన్ని చోట్ల గాయాలు ఉండేలా అప్ప‌టికే చ‌నిపోయిన‌ సుబ్రహ్మణ్యంను(శ‌వాన్ని) అనంతబాబు కర్రతో విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు!

ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం.. స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు అనంత బాబును హాజరు పరిచారు. అనంత‌రం ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Satya

Recent Posts

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

52 seconds ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

11 minutes ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

14 minutes ago

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

22 minutes ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

34 minutes ago

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…

34 minutes ago