Political News

మోడీని ప్ర‌శ్నించేవారంతా.. దేశ‌ద్రోహులా?: కేసీఆర్ ఫైర్‌.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోందని సీఎం తెలిపారు. ఉత్తరాది పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చండీగఢ్లో పర్యటించారు. రైతులు, జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఇరువురు ముఖ్యమంత్రులు పరామర్శించారు. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు నివాళులర్పించారు.

అనంతరం ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రసంగం తర్వాత గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు, అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల సమక్షంలో 600 కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున 18 కోట్ల రూపాల‌య విలువైన చెక్కులను సీఎం కేసీఆర్ రైతుల కుటుంబాల‌కు పంపిణీ చేశారు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది చాలా బాధాకరమైన సందర్భమన్న ఆయన… రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలిపారు. దేశ చరిత్రలో పంజాబ్‌ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారని కొనియాడారు. భగత్‌సింగ్‌ వంటి వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారని పేర్కొన్నారు. పంజాబ్‌ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారన్న సీఎం.. హరిత విప్లవంతో పంజాబ్‌ రైతులు దేశం ఆకలిని తీర్చారని స్పష్టం చేశారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని సీఎం అభినందించారు. రైతుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు గుర్తుచేశారు. బీజేపీను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.

“ఇది చాలా బాధాకరమైన సందర్భం. రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశం పరిస్థితి మారలేదు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారు. పంజాబ్‌ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారు. రైతుల పోరాటానికి మేం సంపూర్ణ మద్దతు ఇచ్చాం. కేంద్ర సర్కార్‌ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోంది. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోంది. మోడీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు. “ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ సరిహద్దులో రైతులు ఏడాదికి పైగా చేసిన పోరాటం కేవలం పంజాబ్‌, హరియాణాకు చెందినది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. యావత్‌ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారని కొనియాడారు. రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయన్న ఆయన… ఆందోళనలో పాల్గొన్న రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు.

This post was last modified on May 23, 2022 6:28 am

Share
Show comments
Published by
Satya
Tags: KCR

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago