మెగా బ్రదర్స్… చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక, యువ మెగా స్టార్ రామ్ చరణ్కు కూడా ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు వీరు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. మెగా కుటుంబం నుంచి వచ్చే సినిమాలను హిట్ చేయడం.. సందడి చేయడం.. పంక్షన్లు పెట్టడం.. జై కొట్టడం వరకే పరిమితమయ్యారు. పైగా ఇందులోనూ.. పవన్ అభిమానులు వేరు. చిరు అభిమానులు వేరే.. అనే గీతలు కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఇలానే వ్యవహరించిన..ఈ మెగా అభిమానులు.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నా రు. తాజాగా ఆదివారం విజయవాడలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సమావేశం అయ్యారు. నగరం నడిబొడ్డున ఉన్న మురళీ ఫార్చున్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. గతంలో పవన్ అభిమానులు వేరేగా.. చిరు అభిమానులు వేరేగా, చరణ్ అభిమానులు వేరేగా వ్యవహరించినా.. ఇప్పుడు అందరూ ఒకే గొడుగు కిందకు చేరుకున్నారు.
ఈ భేటీలో కీలకమైన అంశంగా జనసేన పార్టీకి మద్దతు విషయాన్నే వారు చర్చించారు. వచ్చే 2024 ఎన్నికల్లో మెగా అభిమానులు అందరూ కూడా ఒకేతాటిపైకి వచ్చి.. పవన్కు అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ అంశంపైనే అభిమానులు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించే లక్ష్యం తప్ప మరోకటి లేదన్నట్టుగా ఈ సమావేశం ఉండడం గమనార్హం.
This post was last modified on May 22, 2022 2:09 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు…
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…