మెగా బ్రదర్స్… చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక, యువ మెగా స్టార్ రామ్ చరణ్కు కూడా ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు వీరు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. మెగా కుటుంబం నుంచి వచ్చే సినిమాలను హిట్ చేయడం.. సందడి చేయడం.. పంక్షన్లు పెట్టడం.. జై కొట్టడం వరకే పరిమితమయ్యారు. పైగా ఇందులోనూ.. పవన్ అభిమానులు వేరు. చిరు అభిమానులు వేరే.. అనే గీతలు కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఇలానే వ్యవహరించిన..ఈ మెగా అభిమానులు.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నా రు. తాజాగా ఆదివారం విజయవాడలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సమావేశం అయ్యారు. నగరం నడిబొడ్డున ఉన్న మురళీ ఫార్చున్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. గతంలో పవన్ అభిమానులు వేరేగా.. చిరు అభిమానులు వేరేగా, చరణ్ అభిమానులు వేరేగా వ్యవహరించినా.. ఇప్పుడు అందరూ ఒకే గొడుగు కిందకు చేరుకున్నారు.
ఈ భేటీలో కీలకమైన అంశంగా జనసేన పార్టీకి మద్దతు విషయాన్నే వారు చర్చించారు. వచ్చే 2024 ఎన్నికల్లో మెగా అభిమానులు అందరూ కూడా ఒకేతాటిపైకి వచ్చి.. పవన్కు అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ అంశంపైనే అభిమానులు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించే లక్ష్యం తప్ప మరోకటి లేదన్నట్టుగా ఈ సమావేశం ఉండడం గమనార్హం.
This post was last modified on May 22, 2022 2:09 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…