Political News

మినీ మ‌హానాడులు ఊపిరి పోస్తాయా ?

ప‌సుపు దండు క‌ద‌లివ‌స్తోంది. జిల్లాల‌లో మినీ మ‌హానాడులు పార్టీకి కొత్త ఊపునూ ఉత్సాహాన్ని ఇస్తాయ‌ని భావిస్తున్నాయి తెలుగుదేశం వ‌ర్గాలు. ఆ విధంగా శ్రేణులు, నాయ‌కులు క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్ప‌టికే బాదుడే బాదుడు పేరిట జ‌రిపిన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు అన్నీ హిట్ అయ్యాయి. ఉత్త‌రాంధ్రలో కొత్త ఉత్సాహం వ‌స్తోంది. బాబు కూడా ఇదే ప్రాంతంలో ప‌ర్య‌టించి వెళ్లారు. అటుపై మినీ మ‌హానాడులు కొన్నింట జ‌రిగాయి. ఇవ‌న్నీ కూడా నాయ‌క‌త్వానికీ, శ్రేణుల‌కూ మ‌ధ్య ఉన్న అంత‌రాలు తొల‌గిపోయేందుకు స‌హ‌క‌రిస్తే మేలు అన్న‌ది ఓ వాద‌న వినిపిస్తోంది.

ముఖ్యంగా ప‌ట్టు కోసం, ఉనికి కోసం, మ‌నుగ‌డ కోసం జిల్లాల‌లో నాయ‌కులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఉనికి ఈ సారి ప్ర‌శ్నార్థ‌కం అయితే ఇక‌పై రాజ‌కీయం సాగించ‌డం క‌ష్ట‌మే అన్న అంచ‌నాకు వ‌చ్చారు. అదే ఇవాళ వారిని మ‌రింత బాగా ప‌నిచేసేందుకు కార‌ణం అవుతోంది. చింత‌మనేని లాంటి లీడ‌ర్లు కూడా ఇప్పుడిప్పుడే పార్టీ యాక్టివిటీస్ బాగున్నాయ‌ని అంటున్నారు. అదేవిధంగా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుగుణంగా మార్చుకునేందుకు వీలున్న అన్ని అవ‌కాశాలు వాడుకోవాల‌నిచూస్తున్నారు.

ఇదంతా బాగున్నా వైసీపీ వ‌ర్గాల బ‌లం ముందు టీడీపీ నెగ్గుతుందా అన్న సందేహం కూడా వ‌స్తోంది. ముఖ్యంగా పార్టీ కార్య‌క‌లాపాలు స్పీడప్ అయిన‌ప్పుడే ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ని తెర‌పైకి తెస్తున్నారు. దీంతో చాలా మంచి విష‌యాలు జనాల‌కు చెప్పాల‌నుకుంటున్న విష‌యాలు కూడా ప‌క్క‌దోవ ప‌ట్టిపోతున్నాయి. ఇష్యూ డైవ‌ర్ష‌న్ లేకుండా ఉంటే తాము కూడా బాగా పనిచేయ‌గ‌ల‌మ‌ని అంటున్నారు.

అయితే ఇదే స‌మ‌యంలో లోకేశ్ చెబుతున్న విధంగా కేసులు లేక‌పోతే కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయ‌లేద‌ని తాము భావిస్తామ‌ని అన‌డం భావ్యంగా లేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ప్రజా పోరులో కొంత వృద్ధి సాధించామ‌ని,నాయ‌కులు ప్రోత్స‌హిస్తే ఇంకాస్త ప‌నిచేయ‌డం సాధ్య‌మ‌ని కూడా వీళ్లంతా అంటున్నారు. అంతరాలు తొలగించుకుని ఐక్యంగా పనిచేస్తే ఫ‌లితం సాధించ‌డం అంత కష్టం కాదంటున్నాయి శ్రేణులు. టీడీపీ నాయ‌కులంతా ఏక‌మై పోరుబాట‌లో న‌డిస్తే విజ‌యం త‌థ్యం అన్న‌ది పార్టీ అభిమానుల మాట !

This post was last modified on May 22, 2022 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

3 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

6 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

7 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

11 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

12 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

12 hours ago