పసుపు దండు కదలివస్తోంది. జిల్లాలలో మినీ మహానాడులు పార్టీకి కొత్త ఊపునూ ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఆ విధంగా శ్రేణులు, నాయకులు కలిసి పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు పేరిట జరిపిన నిరసన కార్యక్రమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఉత్తరాంధ్రలో కొత్త ఉత్సాహం వస్తోంది. బాబు కూడా ఇదే ప్రాంతంలో పర్యటించి వెళ్లారు. అటుపై మినీ మహానాడులు కొన్నింట జరిగాయి. ఇవన్నీ కూడా నాయకత్వానికీ, శ్రేణులకూ మధ్య ఉన్న అంతరాలు తొలగిపోయేందుకు సహకరిస్తే మేలు అన్నది ఓ వాదన వినిపిస్తోంది.
ముఖ్యంగా పట్టు కోసం, ఉనికి కోసం, మనుగడ కోసం జిల్లాలలో నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఉనికి ఈ సారి ప్రశ్నార్థకం అయితే ఇకపై రాజకీయం సాగించడం కష్టమే అన్న అంచనాకు వచ్చారు. అదే ఇవాళ వారిని మరింత బాగా పనిచేసేందుకు కారణం అవుతోంది. చింతమనేని లాంటి లీడర్లు కూడా ఇప్పుడిప్పుడే పార్టీ యాక్టివిటీస్ బాగున్నాయని అంటున్నారు. అదేవిధంగా ప్రజా వ్యతిరేకతను తమకు అనుగుణంగా మార్చుకునేందుకు వీలున్న అన్ని అవకాశాలు వాడుకోవాలనిచూస్తున్నారు.
ఇదంతా బాగున్నా వైసీపీ వర్గాల బలం ముందు టీడీపీ నెగ్గుతుందా అన్న సందేహం కూడా వస్తోంది. ముఖ్యంగా పార్టీ కార్యకలాపాలు స్పీడప్ అయినప్పుడే ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ని తెరపైకి తెస్తున్నారు. దీంతో చాలా మంచి విషయాలు జనాలకు చెప్పాలనుకుంటున్న విషయాలు కూడా పక్కదోవ పట్టిపోతున్నాయి. ఇష్యూ డైవర్షన్ లేకుండా ఉంటే తాము కూడా బాగా పనిచేయగలమని అంటున్నారు.
అయితే ఇదే సమయంలో లోకేశ్ చెబుతున్న విధంగా కేసులు లేకపోతే కార్యకర్తలు పనిచేయలేదని తాము భావిస్తామని అనడం భావ్యంగా లేదని అంటున్నారు. ఇప్పటికే ప్రజా పోరులో కొంత వృద్ధి సాధించామని,నాయకులు ప్రోత్సహిస్తే ఇంకాస్త పనిచేయడం సాధ్యమని కూడా వీళ్లంతా అంటున్నారు. అంతరాలు తొలగించుకుని ఐక్యంగా పనిచేస్తే ఫలితం సాధించడం అంత కష్టం కాదంటున్నాయి శ్రేణులు. టీడీపీ నాయకులంతా ఏకమై పోరుబాటలో నడిస్తే విజయం తథ్యం అన్నది పార్టీ అభిమానుల మాట !
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…