Political News

వైసీపీకి ‘దుట్టా’ గుడ్ బై చెప్పేస్తారా ?

గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరైన దుట్టా రామచంద్రరావు పార్టీలో ఇమడలేకపోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావటంతో మారిన రాజకీయాల కారణంగా వంశీ టీడీపీకి దూరమయ్యారు.

డైరెక్టుగా వంశీ వైసీపీలో చేరకపోయినా అనధికారికంగా అధికార పార్టీ ఎంఎల్ఏగానే కంటిన్యూ అవుతున్నారు. ఎప్పుడైతే వంశీ వైసీపీలో చేరారో అప్పటి నుంచి యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలకు పడటం లేదు. అయితే యార్లగడ్డ-వంశీ-దుట్టా తో గతంలోనే జగన్మోహన్ రెడ్డి భేటీఅయి సర్దుబాటుకు ప్రయత్నించారు. జగన్ జోక్యం తర్వాత వంశీ-యార్లగడ్డ మధ్య గొడవలు తగ్గిపోయాయి. అయితే దుట్టాతో మాత్రం వంశీకి గొడవలు జరుగుతునే ఉన్నాయి.

వీళ్ళిద్దరి మధ్య సర్దుబాటుకు మంత్రులు, సజ్జల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇదే సమయంలో రెండువర్గాల మధ్య వివాదాలు బాగా పెరిగిపోతున్నాయి. దాంతో దుట్టా వర్గం మండిపోతోంది. ఈ నేపధ్యంలోనే దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి-వంశీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వంశీని అదుపులో పెట్టకపోతే తమదారి తాము చూసుకుంటామని శివ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ మాటలు చెప్పింది అల్లుడే అయినా దుట్టా ఆమోదం లేకుండా సాధ్యం కాదనే విషయం అర్దమైపోయింది.

అయితే దుట్టాకు అర్ధమవ్వాల్సిందేమంటే వంశీని వదులుకునేందుకు జగన్ కూడా సిద్ధంగా లేరు. పైగా తమ దారి తాము చూసుకుంటామని బెదిరింపు ధోరణిలో మాట్లాడితే జగన్ అసలు పట్టించుకోరు. వెళ్ళిపో దలచుకుంటే పార్టీ నుంచి వెళ్ళిపోవటమే తప్ప బెదిరింపులతో సాధించేదేమీలేదు. ఇదే విషయాన్ని వంశీ వర్గం స్పష్టం చేస్తోంది. పార్టీలో తన పని తాను చేసుకుని పోతున్నానని, తనతో ఏదన్నా సమస్య వస్తే అది వాళ్ళ సమస్యే కానీ తన సమస్య ఎంతమాత్రం కాదని వంశీ బహిరంగంగానే చెప్పేశారు. వాళ్ళు ఏమి చేయదలచుకున్నారో వాళ్ళిష్టమని కూడా వంశీ చెప్పారు. కాబట్టి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది దుట్టాయే.

This post was last modified on May 22, 2022 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

1 hour ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago