Political News

పతంజలి వాళ్లు అసలు కరోనా వైరస్ పేరే ఎత్తలేదట

కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేశామంటూ పతంజలి సంస్థ చేసిన ప్రకటన దేశంలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అలోపతి మందు కోసం లక్షల మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ నిర్దిష్టమైన మందును కనిపెట్టలేదు. వైరస్‌ ప్రభావాన్ని కొంత మేర తగ్గించే మందులేవో తెచ్చారు తప్ప.. దీంతో వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇలాంటి తరుణంలో పతంజలి సంస్థ కేవలం 545 రూపాయల ధరతో ఒక కరోనా కిట్‌ను రిలీజ్ చేసి.. దీన్ని కేవలం రెండు వారాలు వాడితే కరోనా పరార్ అంటూ ఘనంగా ప్రకటించుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా చాలా ధీమాగా ఈ విషయాన్ని ప్రకటించడంతో జనాల్లోనూ ఆశ పుట్టింది. కానీ వాళ్లు ఇలా ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ లైన్లోకి వచ్చింది. ఇది కరోనా మందుగా ప్రచారం చేసుకోవద్దని.. దీని ప్రామాణికతను పరీక్షిస్తున్నామని ప్రకటించింది.

కరోనాకు మందు కనుగొనడం అంటే సంచలన విషయం కావడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు విచారణ కూడా మొదలుపెట్టింది మంత్రిత్వ శాఖ. అసలు ఈ ‘కరోనిల్’ ఔషధానికి ఎలా అనుమతి ఇచ్చారన్న దానిపై విచారణ మొదలైంది. ఈ మందుకు అనుమతులిచ్చిన ఉత్తారఖండ్ ప్రభుత్వ ఆయుర్వేద శాఖ అధికారులను వివరణ కోరగా.. ‘కరోనిల్’ మందును మార్కెట్లోకి తెచ్చేందుకు పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎక్కడా ‘కరోనా వైరస్’ పేరే ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి.. దగ్గు, జ్వరం నియంత్రణకు పని చేసే మందుగా మాత్రమే తాము దానికి అనుమతులు ఇచ్చామని తేల్చేశారు. దీనిపై పంతజలి సంస్థను వివరణ కోరుతామని.. నోటీసు జారీ చేస్తామని.. కోవిడ్-19 కిట్‌గా ప్రచారం చేసుకుంటున్న ఈ మందులకు ఎలా అనుమతి లభించిందో విచారణ జరుపుతామని కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. దీనిపై పతంజలి వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్టాడుతూ.. తాము ఆయుష్ మంత్రిత్వ శాఖ నియమ నిబంధనలను వంద శాతం పాటించామంటూ అనుమతుల విషయాన్ని దాటవేశారు.

This post was last modified on June 24, 2020 7:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

25 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago