Political News

పతంజలి వాళ్లు అసలు కరోనా వైరస్ పేరే ఎత్తలేదట

కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేశామంటూ పతంజలి సంస్థ చేసిన ప్రకటన దేశంలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అలోపతి మందు కోసం లక్షల మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ నిర్దిష్టమైన మందును కనిపెట్టలేదు. వైరస్‌ ప్రభావాన్ని కొంత మేర తగ్గించే మందులేవో తెచ్చారు తప్ప.. దీంతో వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇలాంటి తరుణంలో పతంజలి సంస్థ కేవలం 545 రూపాయల ధరతో ఒక కరోనా కిట్‌ను రిలీజ్ చేసి.. దీన్ని కేవలం రెండు వారాలు వాడితే కరోనా పరార్ అంటూ ఘనంగా ప్రకటించుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా చాలా ధీమాగా ఈ విషయాన్ని ప్రకటించడంతో జనాల్లోనూ ఆశ పుట్టింది. కానీ వాళ్లు ఇలా ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ లైన్లోకి వచ్చింది. ఇది కరోనా మందుగా ప్రచారం చేసుకోవద్దని.. దీని ప్రామాణికతను పరీక్షిస్తున్నామని ప్రకటించింది.

కరోనాకు మందు కనుగొనడం అంటే సంచలన విషయం కావడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు విచారణ కూడా మొదలుపెట్టింది మంత్రిత్వ శాఖ. అసలు ఈ ‘కరోనిల్’ ఔషధానికి ఎలా అనుమతి ఇచ్చారన్న దానిపై విచారణ మొదలైంది. ఈ మందుకు అనుమతులిచ్చిన ఉత్తారఖండ్ ప్రభుత్వ ఆయుర్వేద శాఖ అధికారులను వివరణ కోరగా.. ‘కరోనిల్’ మందును మార్కెట్లోకి తెచ్చేందుకు పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎక్కడా ‘కరోనా వైరస్’ పేరే ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి.. దగ్గు, జ్వరం నియంత్రణకు పని చేసే మందుగా మాత్రమే తాము దానికి అనుమతులు ఇచ్చామని తేల్చేశారు. దీనిపై పంతజలి సంస్థను వివరణ కోరుతామని.. నోటీసు జారీ చేస్తామని.. కోవిడ్-19 కిట్‌గా ప్రచారం చేసుకుంటున్న ఈ మందులకు ఎలా అనుమతి లభించిందో విచారణ జరుపుతామని కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. దీనిపై పతంజలి వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్టాడుతూ.. తాము ఆయుష్ మంత్రిత్వ శాఖ నియమ నిబంధనలను వంద శాతం పాటించామంటూ అనుమతుల విషయాన్ని దాటవేశారు.

This post was last modified on June 24, 2020 7:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago