దేశంలో ఠారెత్తుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు భారీగా తగ్గించింది. పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయలు తగ్గించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలోని వైసీపీ సర్కారు వైపే ప్రజలు చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో నే పెట్రోల్, డీజిల్పై సుంకాలు.. వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినా.. కూడా జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు. ఇక, ఇప్పుడు ఏం చేస్తుందనేది ప్రజల మాట. ఎందుకంటే.. కేంద్రం తగ్గించినా.. రాష్ట్రం తగ్గించకపోతే.. ఈ వేడి నేరుగా సీఎం జగన్నే తాకడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు..
బీజేపీ మోడీ భజన!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందరితోకలసి, అందరి అభివృద్ధికోసం, అందరి విశ్వాసమూ పొంది సమర్ధపాలన అందిస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కరోనాతో కుదేలైన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అన్ని రేట్లూ పెరిగిపోయాయని తెలిపారు. మూలిగే నక్కపై తాటిపండులా రష్యా యుక్రేన్ యుద్ధం అగ్ర రాజ్యాల ఆర్ధిక వ్తవస్థనే ఛిన్నాభిన్నం చేసిందన్నారు. ఎన్నో కష్డనష్టాలు ఎదురవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ పరిపాలనా నౌకను భద్రంగా ఆర్ధికాభివృద్ధి తీరాలకు నడిపిస్తోందని కొనియాడారు.
ఈ క్రమంలో ప్రపంచ రేట్లను అనుసరించి పెట్రోలు డీజిలు తదితర ఉత్పత్తుల రేట్లు పెరిగాయన్నారు. ఇది భారంగా మారిందని ప్రజలు భావిస్తున్న తరుణంలో మోడీ స్వయంగా సమీక్ష జరిపి, కనీ వినీ ఎరుగని రీతిలో ఎక్సయిజు సుంకాలు భారీగా తగ్గించిందని సోము పేర్కొన్నారు. లీటరు పెట్రోలు మీద 8 రూపాయలు, డీజిలు మీద 6 రూపాయలూ తగ్గించిందని, దీనివల్ల పెట్రోలు ధర తొమ్మిదిన్నర రూపాయలు, డీజిలు ధర ఏడు రూపాయలూ తగ్గుతాయన్నారు. తొమ్మిది కోట్లమంది పేదలకు లబ్ధి కలిగేలా వంట గ్యాస్ మీద రెండు వందల రూపాయల రాయితీ ప్రకటించారన్నారు.
జగన్ కు శాపం!
గతంలో ఎక్సయిజు సుంకాలు తగ్గించినపుడు వైసీపీ ప్రభుత్వం తనవంతు సాయం ప్రజలకు చేయలేదని సోము దుయ్యబట్టారు అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పట్లో సుంకాలు తగ్గించాయని, కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాలనుంచి సరిహద్దు ప్రజలు పెట్రోలు డీజిలు పోయించుకోవటం సాధారణంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ధరలు తగ్గించాలన్నారు. “జగన్ గారూ! ఈసారైనా స్పందించండి. మీవంతుగా పన్నులు తగ్గించి పెట్రోలు, డీజిలు మరింత అందుబాటు ధరలో దొరికేలా ప్రజలకు సాయం చేయండి. లేదంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు.” అని సోము శాపం పెట్టారు.
This post was last modified on May 22, 2022 7:09 am
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…