Political News

షాకింగ్ న్యూస్‌: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల భారీ త‌గ్గింపు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల‌మ్మ దేశ ప్ర‌జ‌ల‌పై క‌రుణ కురిపించారు. పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్‌, డీజిల్‌, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్‌, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది(లోక‌ల్ ట్యాక్స్‌లు కొన‌సాగుతాయి). గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది.

వంటగ్యాస్పై వారికే రాయితీ:

పేదలుగా గుర్తింపు పొంది ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో దానిపై కేంద్రం రూ. 200 సబ్సిడీని ప్రకటించింది. దీని ద్వారా 9 కోట్ల మంది పథకం లబ్దిదారులకు మేలు జరగనుంది. చమురు ధరల తగ్గింపుతో ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గ్యాస్‌ రాయితీ వల్ల రూ.6100 కోట్లు ఆదాయం తగ్గనుందని వివరించారు.

నిర్మాణ రంగానికి ఊరట:

ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణాలు భారంగా మారిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఆయా రంగాలకు సంబంధించిన పలు వస్తువులపై కేంద్రం సుంకాలను తగ్గించింది. ఉక్కు, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, ఉక్కు ముడిపదార్థాలపై దిగుమతి సుంకంలో కోత వేసింది. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ముడిపదార్థాలపై సుంకాన్ని తగ్గించింది.

ఎన్నిక‌ల ఎఫెక్ట్

లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గించ‌డం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. వీటి ని త‌గ్గించ‌డం ద్వారా ప్ర‌త్య‌క్షంగా కంటే..ప‌రోక్షంగా ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గుతాయి. నిత్యావ‌స‌రాలు.. కూర‌గాయ‌ల ధ‌ర‌లు.. ర‌వాణా సేవ‌లు.. వంటివి ఎంతో కొంత త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. ఫ‌లితంగా.. ప్ర‌జ‌లకు ఊర‌ట క‌లుగుతుంద‌ని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మ‌రో నాలుగు మాసాల్లో గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్ము క‌శ్మీర్‌, మ‌రో ఆరు మాసాల్లో క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on May 21, 2022 11:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago