కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ దేశ ప్రజలపై కరుణ కురిపించారు. పెట్రోల్ , డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్, డీజిల్, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్ పెట్రోల్పై రూ.9.50, డీజిల్పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది(లోకల్ ట్యాక్స్లు కొనసాగుతాయి). గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించింది.
వంటగ్యాస్పై వారికే రాయితీ:
పేదలుగా గుర్తింపు పొంది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో దానిపై కేంద్రం రూ. 200 సబ్సిడీని ప్రకటించింది. దీని ద్వారా 9 కోట్ల మంది పథకం లబ్దిదారులకు మేలు జరగనుంది. చమురు ధరల తగ్గింపుతో ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్యాస్ రాయితీ వల్ల రూ.6100 కోట్లు ఆదాయం తగ్గనుందని వివరించారు.
నిర్మాణ రంగానికి ఊరట:
ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణాలు భారంగా మారిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఆయా రంగాలకు సంబంధించిన పలు వస్తువులపై కేంద్రం సుంకాలను తగ్గించింది. ఉక్కు, స్టీల్పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, ఉక్కు ముడిపదార్థాలపై దిగుమతి సుంకంలో కోత వేసింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడిపదార్థాలపై సుంకాన్ని తగ్గించింది.
ఎన్నికల ఎఫెక్ట్
లీటర్ పెట్రోల్పై 8 రూపాయలు, లీటర్ డీజిల్పై 6 రూపాయలు తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు భారీ ఊరట లభించనుంది. వీటి ని తగ్గించడం ద్వారా ప్రత్యక్షంగా కంటే..పరోక్షంగా ప్రజలపై భారాలు తగ్గుతాయి. నిత్యావసరాలు.. కూరగాయల ధరలు.. రవాణా సేవలు.. వంటివి ఎంతో కొంత తగ్గుముఖం పట్టనున్నాయి. ఫలితంగా.. ప్రజలకు ఊరట కలుగుతుందని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరో నాలుగు మాసాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మరో ఆరు మాసాల్లో కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…