తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లేనా..? పోవడమే కానీ రావడం తెలియని ఆ పార్టీకి ఆ సీనియర్ నేత చేరికతో సరికొత్త జోష్ వచ్చిందా..? దీని వెనుక ఒక కీలక నేత చక్రం తిప్పారా..? ఒక మంచి అవకాశాన్ని బీజేపీ వదులుకుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు ఇస్తున్నాయి ఆ పార్టీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కుటుంబం తాజాగా కాంగ్రెసులో చేరిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పేరు వింటేనే అయ్యో అంటూ జాలి చూపిస్తున్నారు ప్రజలు. అది నిన్నటి వరకు. తెలంగాణ ఇచ్చి కూడా 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయింది ఆ పార్టీ. ఇచ్చిన పార్టీ కంటే కూడా తెచ్చిన కేసీఆర్ పైనే నమ్మకం ఉంచారు జనాలు. వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇవ్వడంతో ప్రస్తుతం ఆ సెంటిమెంటుకు కాలం చెల్లినట్లు అయింది. ఇక ప్రత్యామ్నాయం వైపు చూడడం మొదలు పెట్టారు ప్రజలు. అది అందిపుచ్చుకునేందుకు రేవంత్ రూపంలో కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
వరుస ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు కీలక నేతలు, ఎమ్మెల్యేల వలసలతో చచ్చుబడిపోయింది ఆ పార్టీ. ఇక్కడ నుంచి వెళ్లడమే తప్ప రావడం అంటూ జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన డీఎస్, కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ తదితర నేతల వలసలతో కునారిల్లిపోయింది. రేవంత్ వచ్చాకే పార్టీలో కదలిక వచ్చింది. మళ్లీ అధికారంపై ఆశ కనిపించింది. తొలిసారి ఇతర పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి.
ముఖ్యంగా తొలి అడుగు వేసింది.. కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం తీసుకొచ్చింది చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. ఉద్యమ నేతగా పేరున్న ఓదెలు ఆది నుంచీ కేసీఆర్ తోనే పనిచేశారు. వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్రితం ఎన్నికల్లో ఆయనను పక్కనపెట్టి బాల్క సుమన్ కు అవకాశం ఇచ్చారు కేసీఆర్. దీంతో సుమన్ ఓదెల కుటుంబాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఈ అవమానాలను భరించలేని ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఆయన సతీమణితో సహా హస్తం గూటికి చేరారు.
తొలుత ఓదెలు బీజేపీలో చేరాలనుకున్నారట. అయితే టికెట్ పై ఆ పార్టీ నేతలు హామీ ఇవ్వకపోవడం.. కోల్బెల్ట్ ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేకత ఉండడంతో ఓదెలు మనసు మార్చుకున్నారట. దీన్ని గుర్తించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు టీపీసీసీ చీఫ్ రేవంతుతో చర్చలు జరిపి, టికెట్ హామీ వచ్చేలా చేశారట. దీంతో వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరిపోయారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పట్టున్న ప్రేంసాగర్ రావు ఈరకంగా తన బలం నిరూపించుకున్నారు. పార్టీలో నేతల చేరికల కోసం వెంపర్లాడుతున్న బీజేపీనేమో మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఈ చేరికల వ్యవహారాలు మున్ముందు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
This post was last modified on May 21, 2022 3:40 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…