కొంతమంది రాజకీయ అధినేతలకు కాలం ఎప్పుడూ కలిసి వస్తూనే ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాంటిది మరికాస్త ఎక్కవనే చెప్పాలి. గడిచిన కొంతకాలంగా కేంద్రంలోని మోడీ సర్కారు మీద అదే పనిగా విరుచుకుపడుతున్న కేసీఆర్ సర్కారు.. ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాల్ని తన అమ్ముల పొదిలో సిద్ధం చేసుకుంటున్నారు.
రాష్ట్రాలు కట్టే పన్నులతో కేంద్రం పెత్తనం ఏమిటన్న ప్రశ్నతో పాటు.. పంచాయితీలకు నేరుగా నిధులు చెల్లించటం ఏమిటి? మధ్యలో మేమేం అయిపోయాం? అంటూ రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తిత్వాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రం తీరును క్వశ్చన్ చేయటం తెలిసిందే.
మరి.. ఇన్నేళ్లుగా గుర్తుకు రాని ఇలాంటివి ఇప్పుడే గులాబీ బాస్ కు ఎందుకు గుర్తుకు వస్తున్నాయంటే.. అదే కేసీఆర్ గొప్పతనం. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న విధానాల్ని.. తనకు అవసరమైన సమయంలో తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఆయనకు మించినోళ్లు కనిపించరు. ఇదిలా ఉంటే.. తాజాగా జీఎస్టీ వ్యవస్థ మొత్తాన్నిప్రభావితం చేసేలా సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జీఎస్టీ మండలి సిఫార్సులకు కట్టబడక్కర్లేదని.. పన్నులపై కేంద్ర.. రాష్ట్రాలకు సమాన అధికారం ఉందన్న మాటలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కచ్ఛితంగా బలాన్నిచేకూర్చటమే కాదు.. ఆయన వాదనకు సరికొత్త అస్త్రాలు చేతికి అందినట్లేనన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జీఎస్టీ మండలి అధికారాలపై సుప్రీంకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on May 20, 2022 2:57 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…