రాష్ట్రంలో రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కాయి. అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇటు అధికార పార్టీ వైసీపీ కూడా.. తీవ్రస్థాయిలో రాజకీయాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే.. ఇప్పుడు.. రాష్ట్రం లో ఎన్నికలు ఏమైనా జరుగుతున్నాయా? అనే సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. అయితే.. ఇప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ ప్రజ ల్లో ఉండాలని నిర్ణయించుకుంది.
గతంలో వైసీపీ కూడా ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ఇదే నిర్ణయం తీసుకుని అడుగులు వేసింది. రెం డేళ్ల ముందు నుంచి వైసీపీ అధినేతగా జగన్ ప్రజల మద్య ఉన్నారు. వారి సమస్యలు విన్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను.. టీడీపీ కూడా తీసుకుంది. అయితే.. అప్పట్లో ప్రజల్లోకి వెళ్లిన.. జగన్కు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ మౌనంగా తన పనితాను చేసుకుని పోయింది. ఇది ఆపార్టీకి నష్టం చేకూర్చింది.
అంటే.. ప్రతిపక్షంగా వైసీపీ అధినేత చేసిన..రాజకీయాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని.. గ్రహించలేక పోయింది టీడీపీ. కానీ, ఇప్పుడు టీడీపీ ప్రజల్లోకి వెళ్తుంటే.. ఆ తరహా.. ప్రచారం.. ప్రజల్లోకి వెళ్తుందని.. గ్రహించిన వైసీపీ ముందుగానే తను కూడా ప్రజల మధ్యకు వచ్చేసింది. అంటే.. టీడీపీ చేసే ప్రచారానికి యాంటీ ప్రచారం చేసి.. ప్రజలు టీడీపీవైపు మొగ్గకుండా చూడాలనేది.. వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కారణం గానే గడపగడపకు అయినా.. మంత్రుల బస్సు యాత్రలైనా.. కనిపిస్తున్నాయి.
దీంతో అటు టీడీపీ ప్రజల్లోకి వెళ్తుండడం.. ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా ప్రజల మధ్యకు వస్తుండడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజల వద్దకు వచ్చే నేతలు.. వెళ్లే నేతలతో రా ష్ట్ర రాజకీయం వేడెక్కింది. అయితే.. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు నాయకులు విమర్శలు చేసుకోవడం తప్ప.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ఉంటే.. బాగుండేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.
This post was last modified on May 20, 2022 12:28 pm
తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ప్రతిపక్షం బీఆర్ఎస్కు దక్కింది. దీనికి సంబంధించి పార్టీ అదినేత, మాజీ…
డెవిల్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ చేసిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇటీవలే ఫస్ట్…
దర్శకుడు పూరి జగన్నాథ్ రెండు వరస డిజాస్టర్ల తర్వాత కంబ్యాక్ కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్…
రాజకీయ అధినేతల మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉండటం సహజం. మాట్లాడే సిద్ధాంతాలు.. విలువల్ని చేతల్లో చేసి చూపిస్తారనుకుంటే తప్పులో…
ఏపీ కూటమి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు…
నిన్న ఇండియా న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతున్నా సరే దానికి ధీటుగా ట్రెండింగ్ లోకి వచ్చిన టాపిక్…