Political News

రెండేళ్ల ముందే ఏపీ రాజ‌కీయం వేడెక్కేసిందే…!

రాష్ట్రంలో రాజకీయాలు తీవ్ర‌స్థాయిలో వేడెక్కాయి. అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఇటు అధికార పార్టీ వైసీపీ కూడా.. తీవ్ర‌స్థాయిలో రాజకీయాలు చేస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే.. ఇప్పుడు.. రాష్ట్రం లో ఎన్నిక‌లు ఏమైనా జ‌రుగుతున్నాయా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఇంకా రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌జ ల్లో ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది.

గ‌తంలో వైసీపీ కూడా ప్ర‌తిపక్షంగా ఉన్న స‌మ‌యంలో ఇదే నిర్ణ‌యం తీసుకుని అడుగులు వేసింది. రెం డేళ్ల ముందు నుంచి వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ద్య ఉన్నారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను.. టీడీపీ కూడా తీసుకుంది. అయితే.. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన‌.. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. ఆ స‌మ‌యంలో అధికారంలో ఉన్న టీడీపీ మౌనంగా త‌న ప‌నితాను చేసుకుని పోయింది. ఇది ఆపార్టీకి న‌ష్టం చేకూర్చింది.

అంటే.. ప్ర‌తిప‌క్షంగా వైసీపీ అధినేత చేసిన‌..రాజకీయాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయ‌ని.. గ్ర‌హించ‌లేక పోయింది టీడీపీ. కానీ, ఇప్పుడు టీడీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంటే.. ఆ త‌ర‌హా.. ప్ర‌చారం.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌ని.. గ్ర‌హించిన వైసీపీ ముందుగానే త‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేసింది. అంటే.. టీడీపీ చేసే ప్ర‌చారానికి యాంటీ ప్ర‌చారం చేసి.. ప్ర‌జ‌లు టీడీపీవైపు మొగ్గ‌కుండా చూడాల‌నేది.. వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ కార‌ణం గానే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అయినా.. మంత్రుల బ‌స్సు యాత్ర‌లైనా.. క‌నిపిస్తున్నాయి.

దీంతో అటు టీడీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తుండ‌డం.. ఇదే స‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తుండ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ప్ర‌జ‌ల వ‌ద్దకు వ‌చ్చే నేత‌లు.. వెళ్లే నేత‌ల‌తో రా ష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. అయితే.. ఈ నేప‌థ్యంలో ఒక‌రిపై ఒక‌రు నాయ‌కులు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం త‌ప్ప‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. ఈ ప‌రిస్థితి మారుతుందేమో చూడాలి.

This post was last modified on May 20, 2022 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

32 minutes ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

48 minutes ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

4 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

12 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

13 hours ago