Political News

తెలంగాణ ప్ర‌జ‌లు ఓటేస్తే.. సీఎం అయ్యారా? జ‌గ‌న్ సార్‌..


వైసీపీ ప్ర‌భుత్వంపై ఎవ‌రైనా విమ‌ర్శుల చేస్తే.. కుట్ర‌లు అంటున్నారు. వారిని ఏకేస్తున్నారు. కొంద‌రు నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాటా అనేస్తున్నారు. నీచులు, ప్ర‌జ‌లు ఛీకొట్టారు.. అయినా.. బుద్ధి రాలేదు. అందుకే మాపై ప‌డి ఏడుస్తున్నారు.. అంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. క‌ట్ చేస్తే.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను సొంత పార్టీ నేత‌లే.. విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వంటివారు తీవ్రంగా విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

స‌రే! ఆయ‌నేదో ప‌ద‌వి ఆశించారు.. ద‌క్క‌లేదు కాబ‌ట్టి.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అని వైసీపీ నేత‌లు స‌రిపుచ్చుకున్నారు.కానీ, ఇప్పుడు.. సొంత పార్టీకి చెందిన అది కూడా ఒక కీల‌క ప‌ద‌విలో ఉన్న నాయ‌కుడు జ‌గ‌న్‌ను ఆయ‌న నిర్ణ‌యాల‌ను ఏకేశారు. ప్ర‌తిప‌క్షాలు త‌ర‌చుగా అనే.. జ‌గ‌న్ తుగ్ల‌క్ అనే మాట‌ను కూడా అనేశారు. మ‌రి దీనిని జ‌గ‌న్ కానీ, వైసీపీ నాయ‌కులు కానీ ఏం స‌మాధానం చెబుతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

ఏం జ‌రిగింది?

బీసీల పట్ల సీఎం జగన్‌ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ నేత దేరంగుల ఉదయ్‌కిరణ్‌ విమర్శించారు. “వెనుకబడిన వర్గాలవారి బాధలు తీర్చకపోతే బీసీలు వైసీపీని వీడతారు. రాబోయే రోజుల్లో వైసీపీకి గడ్డుకాలం తప్పదు” అని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని తన కార్యాలయంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీపై ఆయ‌న నిప్పులు చెరిగారు. ముఖ్యంగా తాజాగా రాజ్య‌స‌భ సీట్ల‌ను ఖ‌రారు చేయ‌డం.. వాటిని పొరుగు రాష్ట్రాల‌కు చెందిన వారికి క‌ట్ట‌బెట్టంపై విర‌చుకుప‌డ్డారు.

“రాష్ట్రానికి చెందని, రాష్ట్రంలో ఓటు హక్కులేని ఆర్‌ కృష్ణయ్యను సీఎం జగన్‌ రాజ్యసభకు ఎంపిక చేయడం ఏమిటి? రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారో లేక తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారో జగన్‌ తెలపాలి. గతంలో రిలయన్స్‌కు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటును ధారాదత్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి చెందని వ్యక్తులకు ఇచ్చారు. జగన్‌ వద్ద తుగ్లక్‌ సలహాదారులు ఉన్నారు. వీరివల్ల పార్టీ భ్రష్టుపడుతోంది” అని మండిపడ్డారు. మ‌రి దీనికి జ‌గ‌న్ ఏం చెబుతారో చూడాల‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

This post was last modified on May 19, 2022 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

35 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

1 hour ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

6 hours ago