Political News

గ‌డ‌ప‌లో అవ‌మానం…యాత్ర అందుకేనా !

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరిట వైసీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లోనే ఆగిపోనుంది అన్న వార్త ఒక‌టి వెలుగు చూస్తోంది.ఎందుకంటే రెండు నెల‌ల పాటు పార్టీ నాయ‌కుల‌ను క్షేత్ర స్థాయిలో ఉంచి ఇంటింటి స‌ర్వే చేయించినా ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా రావ‌ని తేలిపోయింద‌ని, వాస్త‌వాలు మాట్లాడే ప్ర‌జ‌ల దగ్గ‌ర త‌రుచూ అవ‌మానాలే ఎదురవుతున్నాయ‌ని వైసీపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని టీడీపీ అంటోంది. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు లేనేలేవ‌ని తేలిన నిమిషాన విప‌క్షం దాడులు కూడా విప‌రీతం అవుతున్నాయి. ఇవి కూడా ఓ కార‌ణం కావొచ్చు. కొన్ని చోట్ల సీఎం చెప్పినా స‌రే స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు స‌హనం కోల్పోయి మాట్లాడ‌డం కూడా వివాదాల‌కు తావిస్తోంది.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ముఖ్యంగా ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న లేకుండా కొంద‌రు మాట్లాడితే, మ‌రికొంద‌రు మాత్రం త‌మ‌కు ఇబ్బంది క‌ల‌గ‌ని చోటుకు వెళ్లి ఫొటోల‌కు ఫోజులిచ్చి వ‌చ్చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సీనియ‌ర్ నాయ‌కుల‌ను పార్టీ గుర్తించి మంత్రి వ‌ర్గంలో తీసుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. వాళ్లంతా స్థానిక వ్య‌తిరేక‌తను తాము త‌ట్టుకోలేమ‌ని అనుచ‌ర వ‌ర్గాల‌తో తేల్చి చెప్పారు. ఇందుకు శ్రీ‌కాకుళం జిల్లానే పెద్ద ఉదాహ‌ర‌ణ.

రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ఇప్ప‌టిదాకా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేదు. వ్య‌క్తిగ‌త ప‌నుల‌పై హైద్రాబాద్ కు వెళ్లి నిన్న‌నే తిరిగివ‌చ్చారు. ఇక‌పై ఆయ‌న క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్రాధాన్యం ఇస్తారో లేదో కూడా తెలియ‌డం లేదు. ఇక నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు కూడా త‌రుచూ వివాదాల్లో ఉంటున్నారు. ప‌థ‌కాల‌కు సంబంధించి ఆస‌రా కూ చేయూత కూ తేడా కూడా తెలియ‌డం లేద‌ని టీడీపీ ఇప్ప‌టికే ప‌లు మార్లు అంబ‌టిని ట్రోల్ చేసింది.

ఇదేవిధంగా విశాఖ నేత‌లు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ఓ ఎస్సై పై చిందులు తొక్కారు మాజీ మంత్రి అవంతి శ్రీ‌ను. ఉత్త‌రాంధ్ర‌లో బొత్స కూడా ఇప్ప‌టిదాకా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ అనే కార్య‌క్ర‌మంలో పెద్ద‌గా యాక్టివ్ కాలేదు. దాస‌న్న (మాజీ డిప్యూటీ సీఎం) వెళ్తున్నా కూడా స్థానిక స‌మ‌స్య‌లు ఎవ్వ‌రు చెప్పినా దాట‌వేత ధోర‌ణిలో మాట్లాడుతున్నారు. ఇక ఇదే ఉత్తరాంధ్ర‌కు చెందిన య‌ల‌మంచిలి ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు అయితే మా ఊరికి రోడ్డు వేయండి అని అడిగితే డ‌బ్బుల్లేవు నేనెక్క‌డి నుంచి తెచ్చేది నేనేమ‌యినా దేవుడి కొడుకునా అని ఎదురు ప్ర‌శ్నించి ఆడియో టేపుల రూపంలో దొరికిపోయారు. ఇవ‌న్నీ చూశాకే బీసీ మంత్రుల‌తో బ‌స్సు యాత్ర‌కు జ‌గ‌న్ ప్లాన్ చేశార‌న్న‌ది టాక్.

Satya

Recent Posts

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

2 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

2 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

3 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

3 hours ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

3 hours ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

3 hours ago