గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట వైసీపీ చేపట్టిన కార్యక్రమం మధ్యలోనే ఆగిపోనుంది అన్న వార్త ఒకటి వెలుగు చూస్తోంది.ఎందుకంటే రెండు నెలల పాటు పార్టీ నాయకులను క్షేత్ర స్థాయిలో ఉంచి ఇంటింటి సర్వే చేయించినా ఫలితాలు ఆశాజనకంగా రావని తేలిపోయిందని, వాస్తవాలు మాట్లాడే ప్రజల దగ్గర తరుచూ అవమానాలే ఎదురవుతున్నాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారని టీడీపీ అంటోంది. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు లేనేలేవని తేలిన నిమిషాన విపక్షం దాడులు కూడా విపరీతం అవుతున్నాయి. ఇవి కూడా ఓ కారణం కావొచ్చు. కొన్ని చోట్ల సీఎం చెప్పినా సరే స్థానిక ప్రజాప్రతినిధులు సహనం కోల్పోయి మాట్లాడడం కూడా వివాదాలకు తావిస్తోంది.
ప్రజా సమస్యలపై ముఖ్యంగా పథకాలపై అవగాహన లేకుండా కొందరు మాట్లాడితే, మరికొందరు మాత్రం తమకు ఇబ్బంది కలగని చోటుకు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చి వచ్చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సీనియర్ నాయకులను పార్టీ గుర్తించి మంత్రి వర్గంలో తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. వాళ్లంతా స్థానిక వ్యతిరేకతను తాము తట్టుకోలేమని అనుచర వర్గాలతో తేల్చి చెప్పారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లానే పెద్ద ఉదాహరణ.
రెవెన్యూ మంత్రి ధర్మాన ఇప్పటిదాకా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేదు. వ్యక్తిగత పనులపై హైద్రాబాద్ కు వెళ్లి నిన్ననే తిరిగివచ్చారు. ఇకపై ఆయన క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు. ఇక నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా తరుచూ వివాదాల్లో ఉంటున్నారు. పథకాలకు సంబంధించి ఆసరా కూ చేయూత కూ తేడా కూడా తెలియడం లేదని టీడీపీ ఇప్పటికే పలు మార్లు అంబటిని ట్రోల్ చేసింది.
ఇదేవిధంగా విశాఖ నేతలు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ఓ ఎస్సై పై చిందులు తొక్కారు మాజీ మంత్రి అవంతి శ్రీను. ఉత్తరాంధ్రలో బొత్స కూడా ఇప్పటిదాకా గడపగడపకూ అనే కార్యక్రమంలో పెద్దగా యాక్టివ్ కాలేదు. దాసన్న (మాజీ డిప్యూటీ సీఎం) వెళ్తున్నా కూడా స్థానిక సమస్యలు ఎవ్వరు చెప్పినా దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక ఇదే ఉత్తరాంధ్రకు చెందిన యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు అయితే మా ఊరికి రోడ్డు వేయండి అని అడిగితే డబ్బుల్లేవు నేనెక్కడి నుంచి తెచ్చేది నేనేమయినా దేవుడి కొడుకునా అని ఎదురు ప్రశ్నించి ఆడియో టేపుల రూపంలో దొరికిపోయారు. ఇవన్నీ చూశాకే బీసీ మంత్రులతో బస్సు యాత్రకు జగన్ ప్లాన్ చేశారన్నది టాక్.
This post was last modified on May 19, 2022 9:53 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…