Political News

గ‌డ‌ప‌లో అవ‌మానం…యాత్ర అందుకేనా !

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరిట వైసీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లోనే ఆగిపోనుంది అన్న వార్త ఒక‌టి వెలుగు చూస్తోంది.ఎందుకంటే రెండు నెల‌ల పాటు పార్టీ నాయ‌కుల‌ను క్షేత్ర స్థాయిలో ఉంచి ఇంటింటి స‌ర్వే చేయించినా ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా రావ‌ని తేలిపోయింద‌ని, వాస్త‌వాలు మాట్లాడే ప్ర‌జ‌ల దగ్గ‌ర త‌రుచూ అవ‌మానాలే ఎదురవుతున్నాయ‌ని వైసీపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని టీడీపీ అంటోంది. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు లేనేలేవ‌ని తేలిన నిమిషాన విప‌క్షం దాడులు కూడా విప‌రీతం అవుతున్నాయి. ఇవి కూడా ఓ కార‌ణం కావొచ్చు. కొన్ని చోట్ల సీఎం చెప్పినా స‌రే స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు స‌హనం కోల్పోయి మాట్లాడ‌డం కూడా వివాదాల‌కు తావిస్తోంది.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ముఖ్యంగా ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న లేకుండా కొంద‌రు మాట్లాడితే, మ‌రికొంద‌రు మాత్రం త‌మ‌కు ఇబ్బంది క‌ల‌గ‌ని చోటుకు వెళ్లి ఫొటోల‌కు ఫోజులిచ్చి వ‌చ్చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సీనియ‌ర్ నాయ‌కుల‌ను పార్టీ గుర్తించి మంత్రి వ‌ర్గంలో తీసుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. వాళ్లంతా స్థానిక వ్య‌తిరేక‌తను తాము త‌ట్టుకోలేమ‌ని అనుచ‌ర వ‌ర్గాల‌తో తేల్చి చెప్పారు. ఇందుకు శ్రీ‌కాకుళం జిల్లానే పెద్ద ఉదాహ‌ర‌ణ.

రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ఇప్ప‌టిదాకా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేదు. వ్య‌క్తిగ‌త ప‌నుల‌పై హైద్రాబాద్ కు వెళ్లి నిన్న‌నే తిరిగివ‌చ్చారు. ఇక‌పై ఆయ‌న క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్రాధాన్యం ఇస్తారో లేదో కూడా తెలియ‌డం లేదు. ఇక నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు కూడా త‌రుచూ వివాదాల్లో ఉంటున్నారు. ప‌థ‌కాల‌కు సంబంధించి ఆస‌రా కూ చేయూత కూ తేడా కూడా తెలియ‌డం లేద‌ని టీడీపీ ఇప్ప‌టికే ప‌లు మార్లు అంబ‌టిని ట్రోల్ చేసింది.

ఇదేవిధంగా విశాఖ నేత‌లు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ఓ ఎస్సై పై చిందులు తొక్కారు మాజీ మంత్రి అవంతి శ్రీ‌ను. ఉత్త‌రాంధ్ర‌లో బొత్స కూడా ఇప్ప‌టిదాకా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ అనే కార్య‌క్ర‌మంలో పెద్ద‌గా యాక్టివ్ కాలేదు. దాస‌న్న (మాజీ డిప్యూటీ సీఎం) వెళ్తున్నా కూడా స్థానిక స‌మ‌స్య‌లు ఎవ్వ‌రు చెప్పినా దాట‌వేత ధోర‌ణిలో మాట్లాడుతున్నారు. ఇక ఇదే ఉత్తరాంధ్ర‌కు చెందిన య‌ల‌మంచిలి ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు అయితే మా ఊరికి రోడ్డు వేయండి అని అడిగితే డ‌బ్బుల్లేవు నేనెక్క‌డి నుంచి తెచ్చేది నేనేమ‌యినా దేవుడి కొడుకునా అని ఎదురు ప్ర‌శ్నించి ఆడియో టేపుల రూపంలో దొరికిపోయారు. ఇవ‌న్నీ చూశాకే బీసీ మంత్రుల‌తో బ‌స్సు యాత్ర‌కు జ‌గ‌న్ ప్లాన్ చేశార‌న్న‌ది టాక్.

This post was last modified on May 19, 2022 9:53 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

5 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

6 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

7 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

8 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

11 hours ago