Political News

మ‌హానాడు ఎఫెక్ట్‌.. వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్ ఏం చేస్తోందంటే!

ముఖ్యమంత్రి జగన్‌ కేబినెట్‌లోని మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. విశాఖ నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ బ‌స్సు యాత్ర వెనుక టీడీపీ మ‌హానాడును దెబ్బ‌కొట్టే వ్యూహం ఉంద‌ని.. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే ఇలా చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

టీడీపీకి దెబ్బేయ‌డ‌మేనా?

టీడీపీ మహానాడు దెబ్బకు వైసీపీలో కలవరం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రలకు భారీ ప్రజాస్పందనతో వైసీపీ సర్కార్ పోటీ యాత్ర చేస్తోంది. సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల బస్సు యాత్రకు ఉపక్రమించారు. ఈనెల 26 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రుల బస్సు యాత్రపై వైసీపీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. గడపగడపకు కొనసాగుతున్నందున బస్సు యాత్ర ఎందుకని పార్టీలో మరోవర్గం ప్రశ్నిస్తోంది.

అదేస‌మ‌యంలో గడపగడప ప్ర‌భుత్వం కార్యక్రమంలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. సభల ఏర్పాటు, బస్సు రూట్ మ్యాప్‌పై వైసీపీ అధిష్టానం సమా వేశం అయింది. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారులు హాజర‌య్యారు. బస్సు యాత్రపై మరింత స్పష్టత వచ్చింది. మరోవైపు జిల్లాకు ఒక బీసీ సదస్సు నిర్వహించాల‌ని వైసీపీ ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇవి కూడా అదే స‌మ‌యంలో నిర్వ‌హించాల‌ని ఆదేశించింది.

This post was last modified on May 18, 2022 8:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago