Political News

సొంత ఊళ్లో బొత్స‌కు ఝ‌ల‌క్ ! అయినోళ్లే దెబ్బేశారే !

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు సొంత ఊళ్లోనే ఝ‌ల‌క్ త‌గిలింది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వేల మంది కార్య‌క‌ర్త‌లు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ అనూహ్య ప‌రిణామంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. మంత్రి బొత్స పోక‌డ‌లు న‌చ్చ‌క వీరంతా ప‌సుపు కండువాలు క‌ప్పుకున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా గ‌త కొద్దికాలంగా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో సొంత మ‌నుషులే మంత్రిని న‌మ్మ‌డం లేద‌ని కూడా తెలుస్తోంది. మంత్రికి ఇంటి పోరు కూడా విపరీతంగా ఉంది.

అటు రాష్ట్ర ప్ర‌భుత్వంలో మ‌రో సారి చోటు ద‌క్కించుకున్నా ఆయ‌న ఆశించిన రీతిలో ప‌నిచేయ లేక‌పోతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌డంలో ఆయ‌న త‌డ‌బడ్డార‌న్న వాద‌న‌కు బలం చేకూరుస్తూ అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవ‌న్నీ కూడా బొత్స ఇమేజ్ ను త‌గ్గించేవే ! న‌ష్ట ప‌రిచేవే !

ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు అస్స‌లు లేవు. ఇంకా చెప్పాలంటే చీపురుప‌ల్లి బ‌స్టాండ్ ఇవాళ్టికీ అధ్వాన స్థితిలోనే ఉంది. కొద్దిపాటి అభివృద్ధి ప‌నులు మాత్రం విజ‌య‌న‌గ‌రంలో చేప‌ట్టినా, ఆ పాటి కూడా ఇక్క‌డ చేయ‌లేక‌పోయారు. దీంతో గ్రామాల్లో తిరుగాడేందుకు ఆయ‌న పెద్ద‌గా సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. విజ‌య‌న‌గ‌రంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా వాటిలో ఇప్ప‌టిదాకా బొత్స పాల్గొన్న దాఖ‌లాలేవి పెద్ద‌గా లేవు. ఒక‌వేళ ఆయ‌న క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా, ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించినా కూడా ఆశించిన ఫ‌లితాలు అయితే రావు.

మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున కిమిడి నాగార్జున (మాజీ మంత్రి కిమిడి మృణాళిని) కొడుకు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ వైఫ‌ల్యాల‌ను వివ‌రించ‌డంలో ముందుంటున్నారు. అదేవిధంగా బాదుడే బాదుడు పేరిట నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌తో పాటు నిన్న‌టి వేళ ఉత్త‌రాంధ్ర తెలుగు యువ‌త స‌భ‌ను నిర్వ‌హించి, కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ ప‌రిచారు. ఇవ‌న్నీ బొత్స ఎదుగుద‌ల‌కు ప్ర‌తిబంధకం కానున్నాయి.

This post was last modified on May 16, 2022 10:05 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

6 hours ago