చింతన్ శిబిర్లో ఇప్పుడు గాంధీల కుటుంబానికే పెద్ద చింత ఎదురయింది. దేశవ్యాప్తంగా కుటుంబ పాలనకు చెక్ పెట్టాలని భావిస్తున్న పార్టీ కుటుంబంలో ఒకరికే టికెట్ అని ప్రకటించింది. అయితే.. ఈ సమస్య.. తొలిగా.. సోనియా కుటుంబానికే పెద్ద చిక్కు తీసుకువచ్చింది. ఈ కుటుంబంలో ఇప్పటి వరకు ఇద్దరు సోనియా, రాహుల్ పోటీ చేస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో కుమార్తె, అల్లుడు.. ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కూడా రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనేది.. పార్టీఅ ధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక, ఎన్నికల్లో వరుస ఓటములు, అంతర్గత సవాళ్లు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ.. తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకునేందుకు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తోంది. 2024 ఎన్నికలకు సిద్ధమవుతూనే పార్టీని పూర్తిగా సంస్కరించాలని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జరిగే చింతన్ శిబిర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్రమంలో కీలక ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్. “చింతన్ శిబిర్లో ‘ఒకే కుటుంబం- ఒకే టికెట్’ ప్రతిపాదనపై చర్చ జరగుతోంది. ఒకవేళ అదే కుటుంబంలోని మరో సభ్యుడు పార్టీతో గత ఐదేళ్లుగా పనిచేసినట్లయితే.. వారికి మినహాయింపు ఉంటుంది. మండల కమిటీల ఏర్పాటుపై బూత్, బ్లాక్ స్థాయి కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం, ప్రస్తుతం పార్టీలో పదవీ కాలం గరిష్ఠంగా 3 ఏళ్లు ఉండగా.. దానిని ఐదేళ్లకు పెంచటం, పార్టీ నేతల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు వంటి ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది.” అని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూపీ లోని రాయ్బరేలీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. కేరళలోని వయనాడ్ లోక్సభ ఎంపీ గా రాహుల్ గాంధీ కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. అయితే.. చింతన్ శిబిరంలో చర్చకు వచ్చిన ‘ఒకే కుటుంబం.. ఒకే టికెట్’ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపితే.. గాంధీ కుటుంబీకులపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు.
దీంతో సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి ఏమిటి? అనే చర్చ మొదలైంది. దీనికితోడు.. వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని.. అల్లుడు రాబర్ట్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే, ఈ ప్రతిపాదనలోనే ఐదేళ్ల మెలిక ఉన్నందున వారి పదవులకు వచ్చిన ముప్పేదీ లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా.. కుటుంబ పార్టీలే వర్ధిల్లుతాయన్నమాట.!!
This post was last modified on May 13, 2022 5:00 pm
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…