Political News

కుప్పంలో ఓటమికి తమ్ముళ్ళదే తప్పు

కుప్పం నియోజకవర్గంలోని నేతలు సక్రమంగా పని చేసుంటే మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత చిత్తుగా ఓడిపోయేవారమా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు రోజుల నియోజకవర్గం పర్యటనలో గుడెపల్లె  మండలంలో చంద్రబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోవటానికి తమ్ముళ్ళదే తప్పని తేల్చారు. కొందరు నేతలు నాయకులుగా కాకుండా వినాయకులుగా మారిపోవటమే ఘోర ఓటమికి ప్రధాన కారణంగా చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గరనుండి చంద్రబాబు రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీ ఇబ్బందులు పడకుండా మళ్ళీ బలోపేతమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నియోజవర్గంలో పర్యటనలు, నేతలతో వరుసగా సమీక్షలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తన పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి పనితీరు తదితరాలపై చంద్రబాబు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.

ఇదే సమయంలో ఏడుసార్లు నియోజకవర్గం నుంచి తనను గెలిపించి ముద్దు బిడ్డగా చూసుకున్నట్లు చెప్పారు. తాను తప్పుచేశానని, మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటానికి తనదే తప్పని అంగీకరించారు. తనవైపు తప్పులు జరిగాయి కాబట్టే తాను తలవంచుకుంటున్నట్లు చెప్పారు. తానుచేసిన తప్పును సరిదిద్దుకోవటంలో భాగంగానే తొందరలోనే కుప్పంలో ఇల్లు నిర్మించుకోబోతున్నట్లు తెలిపారు.

సొంతింటి నిర్మాణం కోసం 2 ఎకరాలు కొనుగోలు చేసిన విషయాన్ని చంద్రబాబు వివరించారు. పార్టీలోని కార్యకర్తల నుండి వస్తున్న డిమాండ్ల ప్రకారం కోవర్టులను గనుక చంద్రబాబు ఏరేయగలిగితే పార్టీ బలోపేతమవ్వటం పెద్ద కష్టమేమీ కాదనే ప్రచారముంది. మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీకి లోపాయికారీగా సహకరించిన నేతలు ఎవరో తనకు తెలుసని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయితే వారిలో ఏ ఒక్కరు మీదా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కోవర్టులను చంద్రబాబు ఎందుకు ఏరేయటం లేదనే చర్చ కూడా జరుగుతోంది. కాబట్టి కుప్పంలో ఇల్లు కట్టుకుంటే సరిపోదని, కోవర్టులను ఏరేయాలని నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు స్పష్టంచేశారు. మరి తాజా  పర్యటనలో చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి. 

This post was last modified on May 13, 2022 1:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

35 minutes ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

37 minutes ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

2 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

2 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

2 hours ago

అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి…

2 hours ago