Political News

పెద్దిరెడ్డి యు టర్న్ – ట్యాపింగ్ కాదు, ట్రాకింగ్

పరీక్షల వ్యవహారం నిన్న పెద్దిరెడ్డి కామెంట్స్ తో కొత్తమలుపు తిరిగిన విషయం తెలిసిందే. పబ్లిక్ గా మంత్రి ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించడంతో రచ్చ అయిపోయింది. ముందు నుంచి మేము చెబుతున్నది ఇదే… వైసీపీ మా ఫోన్లను ట్యాప్ చేస్తోంది అని టీడీపీ గట్టిగా విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. మరి రాత్రంతా ఏం సమాలోచన చేశారో గాని మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యంగా  కొత్త క్లారిఫికేష‌న్ ఇచ్చారు. దీంతో రాజ‌కీయం మ‌రో మ‌లుపు తీసుకుంది. మేము చేసింది ట్యాపింగ్ కాదు,  ట్రాకింగ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. త‌మ‌కు ట్రాకింగ్ అంటే ఏంటో  ట్యాపింగ్ అంటే ఏంటో కూడా తెలుసు అన్న భావ‌న‌తో ఆయ‌న మాట్లాడారు.  

ఇదే విధంగా ఇంతే వేగంతో లీకు అయిన ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తే ఇంకా  బాగుంటుంది అని అదేవిధంగా పెద్దాయ‌న కూడా బొత్స తో రాజీనామా చేయిస్తే ఇంకా బాగుంటుంది అని సోష‌ల్ మీడియాలో జనం  అంటున్నారు.  ఫోన్ ట్యాపింగ్ అంటే ఆ రోజు ఓటుకు నోటు కేసులో వినిపించిన ప‌దం మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు విన‌ప‌డ‌డం కూడా ఓ విధంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను పున‌రాలోచ‌న‌లో ప‌డేస్తున్నాయి. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పెగాస‌స్ అనే స్పై వేర్ కుంభ‌కోణం క‌దిపి కుదిపేస్తుంటే, ఏపీ పెగాసస్ ఈ టెన్తు పరీక్ష‌ల కార‌ణంగా తెర‌పైకి వ‌చ్చిందా అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. అదే క‌నుక జ‌రిగితే ట్యాపింగ్ క‌నుక రుజువైతే  ప్ర‌భుత్వంతో పాటు పోలీసులకూ కోర్టు నుంచి ఇబ్బందులు రావొచ్చు. కనుక ట్యాపింగ్ ఏంటి ట్యాకింగ్ ఏంటి అన్న‌వి వివ‌రించి వెళ్లండి పెద్దిరెడ్డి అని అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు.

మ‌రోవైపు నారాయ‌ణ‌కు బెయిల్ విష‌య‌మై  దుమారం రేగింది. దీనిని కూడా పెద్దిరెడ్డితో స‌హా మిగ‌తా వైసీపీ పెద్ద‌లు స‌వాలుగానే స్వీక‌రించారు. స‌జ్జ‌ల చెబుతున్న ప్ర‌కారం వీటిపై కోర్టుకు వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. అయితే టెన్త పేప‌ర్ లీకులో  ద‌ర్యాప్తు వేగం చేయ‌డంతో పాటు అదే చేత్తో రాష్ట్రంలో వివిధ ప‌థ‌కాల పేరిట జ‌రిగి ఉన్న కొన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆర్గ‌నైడ్జ్ క్రైం ల‌పై కూడా పెద్దిరెడ్డి మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని టీడీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో గ‌గ్గోలు పెడుతున్నారు. నారాయ‌ణ విష‌య‌మై  ప‌ట్టుబ‌డుతున్న వైసీపీ అదేవిధంగా సొంత మ‌నుషుల‌కూ ఈ త‌గాదాలో  చోటు ఉంద‌న్న విష‌యం ఎలా మ‌రిచిపోతార‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇప్ప‌టిదాకా ఈ కేసులో ప‌స లేద‌ని తేలిపోయిక బెయిల్ ర‌ద్దు చేయాల‌ని హైకోర్టుకు వెళ్లి వైసీపీ సాధించేది నిండు సున్నా అని అంటోంది టీడీపీ. 

This post was last modified on May 13, 2022 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

40 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

41 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

2 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

2 hours ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

2 hours ago