ఏపీ అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి పోరు.. పెరిగిపోతోంది. ఎక్కడికక్కడ నాయకుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఆధిపత్య పోరు.. ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోవడం వంటి కారణాలతో పలు జిల్లాల్లో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరీముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లోను బీజేపీ పుంజుకుంటున్న జిల్లాల్లోనూ.. వైసీపీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం.. రాజకీయంగా పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలపై అధిష్టానం సీరియస్ అయినప్పటికీ.. నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఉదాహరణకు అనంతపురం జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో జగన్ సునామీ కారణంగా.. ఇక్కడ వైసీపీ పుంజుకుని.. టీడీపీ ఓడిపోయినా అదే ఆ పార్టీకి శాశ్వతం కాదు. ఇటు టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. మాజీ మంత్రులు ఉన్నారు. నియోజకవర్గాలనే కాకుండా.. జిల్లాలను సైతం శాశించే నేతలు ఉన్నారు. ఇక, బీజేపీ కూడా ఇక్కడ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ తరచుగా.. కార్యక్రమాలు చేస్తోంది. అదే సమయంలో జనసేన పార్టీ ఇక్కడ పుంజుకునేలా వ్యూహాలు అమలు చేస్తోంది.
ఏడాదిలో రెండు మూడు సార్లు జనసేన అధినేత పవన్ ఇక్కడ పర్యటిస్తున్నారు. అంటే మొత్తంగా.. అనంతపై టీడీపీ పట్టు ఉండగా.. జనసేన, బీజేపీలుకూడా ఇక్కడ పట్టుపెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ నాయకులు పుంజుకునేలా.. ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పైగా.. ఒకరిపై ఒకరు అధిపత్య రాజకీయాలు చేసుకోవడంతోపాటు.. మేం ఎందుకు గెలవం అనే దిశగా వారు వ్యవహరిస్తున్నారు.
హిందూపురం ఎంపీకి ఆయన పార్లమెంటు పరిధిలో మూడు, నాలుగు నియోకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పడడం లేదు. పైగా కొద్ది రోజులుగా ఆయన టీడీపీ ఎమ్మెల్యే ఉన్న హిందూపురం నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో వేలు పెట్టడంతో అక్కడ నానా గొడవ జరిగింది. ఇక అనంతపురం ఎంపీ రంగయ్యకు తాజాగా మంత్రి అయిన ఉషా శ్రీచరణ్తో ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది.
ఇక శంకర్ నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఉషా శ్రీచరణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పుట్టపర్తి, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, శింగనమల లాంటి చోట్ల గ్రూపు రాజకీయాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏదేమైనా గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను పగలగొట్టిన వైసీపీ ఆనందం ఎక్కువ రోజులు ఉండేలా లేదు.
This post was last modified on May 11, 2022 9:43 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…