Political News

వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారట

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చివరి ఎన్నికలని చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసట. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ తన పరిపాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం జగన్ కు తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపినట్లు చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని జనాలే చెప్పుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

తాను పాల్గొంటున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి జనాల నుంచి అనూహ్యంగా సానుకూల స్పందన వస్తున్న విషయాన్ని చంద్రబాబు వివరించారు. ఈ ప్రోగ్రామ్ ను జనాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని ఆదేశించారు. భీమిలి పర్యటనల్లో జనాలు జై బాబు అని చేసిన నినాదాలను వైసీపీ జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలన్న వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లుగా వైసీపీ వక్రీకరించిందని మండిపడ్డారు.

జగన్ తనని తాను పులిగా అభివర్ణించుకుంటారు కానీ నిజానికి ఆయన పిల్లి మాత్రమే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భయంతోనే జగన్ అందరి కాళ్ళు పట్టుకుంటున్నారని అలాంటిది తాను పులని ఎలా చెప్పుకుంటారంటు చంద్రబాబు నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. కాబట్టి జనాల మూడ్ ను పార్టీ నేతలు అవకాశంగా తీసుకోవాలని సూచించారు.

నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాకుండా గ్రామ స్ధాయికి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని నేతలు తీసుకెళ్ళాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. మరో రెండేళ్ళపాటు ప్రతిస్ధాయిలోని నేతలు కష్టపడితే కచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు. జగన్, మంత్రుల్లోని భయం, నిరస స్పష్టంగా తెలిసిపోతోందన్న చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని పార్టీ గట్టిగా అడ్వాంటేజ్ తీసుకోవాలని గట్టిగా చెప్పారు.

This post was last modified on May 10, 2022 11:23 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

20 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago