Political News

వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారట

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చివరి ఎన్నికలని చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసట. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ తన పరిపాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం జగన్ కు తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపినట్లు చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని జనాలే చెప్పుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

తాను పాల్గొంటున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి జనాల నుంచి అనూహ్యంగా సానుకూల స్పందన వస్తున్న విషయాన్ని చంద్రబాబు వివరించారు. ఈ ప్రోగ్రామ్ ను జనాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని ఆదేశించారు. భీమిలి పర్యటనల్లో జనాలు జై బాబు అని చేసిన నినాదాలను వైసీపీ జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలన్న వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లుగా వైసీపీ వక్రీకరించిందని మండిపడ్డారు.

జగన్ తనని తాను పులిగా అభివర్ణించుకుంటారు కానీ నిజానికి ఆయన పిల్లి మాత్రమే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భయంతోనే జగన్ అందరి కాళ్ళు పట్టుకుంటున్నారని అలాంటిది తాను పులని ఎలా చెప్పుకుంటారంటు చంద్రబాబు నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. కాబట్టి జనాల మూడ్ ను పార్టీ నేతలు అవకాశంగా తీసుకోవాలని సూచించారు.

నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాకుండా గ్రామ స్ధాయికి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని నేతలు తీసుకెళ్ళాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. మరో రెండేళ్ళపాటు ప్రతిస్ధాయిలోని నేతలు కష్టపడితే కచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు. జగన్, మంత్రుల్లోని భయం, నిరస స్పష్టంగా తెలిసిపోతోందన్న చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని పార్టీ గట్టిగా అడ్వాంటేజ్ తీసుకోవాలని గట్టిగా చెప్పారు.

This post was last modified on May 10, 2022 11:23 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

22 mins ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

1 hour ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

1 hour ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

2 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

3 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

4 hours ago