Political News

ప‌వ‌న్ బ‌య‌ట‌కొచ్చిన‌ప్పుడే పార్టీ.. ఇదెక్క‌డి రాజ‌కీయం…!

రాజ‌కీయ పార్టీ అంటే.. ప్ర‌జ‌ల‌కు గుర్తుండి పోవాలి. పార్టీ నాయ‌కులు అంటే.. ప్ర‌జ‌ల్లో ముద్ర‌ప‌డిపోవాలి. అయితే.. ఈరెండింటికీ భిన్నంగా.. జ‌న‌సేన వ్య‌వ‌హారం ఉంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలో ప్రారంబించిన జ‌నసేన పార్టీపై ప్ర‌జ‌ల్లో ఎక్క‌డా చ‌ర్చ సాగడం లేదు. పార్టీ పెట్టి 8 ఏళ్లు దాటుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన నాయ‌కులు జెండా లేకుండా వెళ్లినా.. ప‌వ‌న్ ఫొటో లేకుండా వెళ్లినా.. ప్ర‌జ‌లు గుర్తు ప‌ట్టే ప‌రిస్థితి లేదు.

ఇటీవ‌ల ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనే ఇలాంటి సంఘ‌ట‌న ఎదురైంది. దీంతో ఖంగుతిన్న నాయ‌కులు ఈ విష‌యంపై ప‌వ‌న్‌కు స‌మాచారం అందించారు. “సార్ మ‌న‌ల్ని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌డం లేదు సార్‌” అంటూ.. ఆయ‌న ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. అయితే.. దీనిని ప‌వ‌న్ ఎలా తీసుకున్నారో తెలియ‌దు.. కానీ.. మ‌ళ్లీ ప‌రిస్థితి మాత్రం మామూలే! క‌ట్ చేస్తే.. ఈ ఎనిమిదేళ్ల‌లో ప‌ట్టుమ‌ని.. మూడు మాసాలు కూడా ప్ర‌జ‌ల్లో జ‌న‌సేన గురించి చ‌ర్చ అయితే.. జ‌ర‌గేలేద‌నేది వాస్త‌వం.

ఎలా చూసుకున్నా.. ప‌వ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య ఒక్క మూడు మాసాలు లేదా.. క‌నీసం 50 రోజ‌లు పాటు.. ఆయ‌న ప‌ర్య‌టించింది లేదు. హ‌డావుడిగా రావ‌డం.. ఓ మూడు రోజులు మురిపించ‌డం.. వెంట‌నే వెళ్లిపోవ‌డం. ఇదే తంతు కొన‌సాగుతోంది. ఉన్న మూడు రోజులు కూడా.. నిర్మాణాత్మ‌క రాజ‌కీయాలు చేస్తున్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఈ మాట ఎవ‌రో అన‌డం కాదు.. నేరుగా.. ప‌వ‌న్ సామాజిక‌వ ర్గానికి చెందిన నాయ‌కులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఎంత సామాజిక వ‌ర్గం అభిమానం ఉన్నా.. ప్ర‌జ‌లు ఓట్లు వేయాలంటే.. నాయ‌కుల‌ను గుర్తు ప‌ట్టాలి.

నాయ‌కులు త‌మ మ‌ధ్య ఉండాలని కోరుకుంటారు. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌న‌సేన ఫుల్లుగా ఫెయిల్ అయింది. కేడ‌ర్ లేదు. నాయ‌కులు లేరు. ఉన్న‌వారు బ‌య‌ట‌కు రారు. వ‌చ్చినా.. ప్ర‌జ‌లు గుర్తు ప‌ట్టే ప‌రిస్థితి లేదు. దీనికి కార‌ణం.. టీడీపీ మాదిరిగానో.. వైసీపీ మాదిరిగానో.. జ‌న‌సేన నాయ‌కులు జ‌నంలో ఉండ‌రు. అంతేకాదు.. ఏదైనా కీల‌క విష‌యాన్ని లేవ‌నెత్తి.. ఆ విష‌యంపై సుదీర్ఘ పోరాటం చేసే వ్యూహం కూడా అనుస‌రించ‌రు. దీంతో ప్ర‌జ‌లు జ‌న‌సేన నాయ‌కుల‌ను గుర్తు ప‌ట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇక‌, పార్టీ త‌ర‌ఫున స‌భ‌లు.. స‌మావేశాలు.. నాయ కుల‌ను క్షేత్ర‌స్థాయిలోకి పంపించ‌డం.. కార్య‌క‌ర్త‌ల‌ను ప్రొత్స‌హించ‌డం వంటివి లేక‌పోవ‌డంతో పార్టీ గురించిన చ‌ర్చ .. ఎక్క‌డా జ‌ర‌గ‌డం లేదు. అంతేకాదు.. నాయ‌కులు సైతం ప‌ల‌చ‌గా ఉండ‌డం.. పార్టీ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో వారికి ఎలాంటి పాత్ర లేక‌పోవ‌డం.. మ‌రో విచిత్రం. దీంతో జ‌న‌సేన పుంజుకుంటున్న దాఖ‌లా మాట అలా ఉంచితే.. “ప‌వ‌న్ వ‌స్తే..పార్టీ” అనే మాట వినిపిస్తోంది. ఇదే ప‌రిస్తితి కొన‌సాగితే.. ప్ర‌జ‌ల్లో నమ్మ‌కం ఎలా క‌లుగుతుంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on May 9, 2022 9:10 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

8 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

10 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

10 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

10 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

12 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

15 hours ago