రాజకీయ పార్టీ అంటే.. ప్రజలకు గుర్తుండి పోవాలి. పార్టీ నాయకులు అంటే.. ప్రజల్లో ముద్రపడిపోవాలి. అయితే.. ఈరెండింటికీ భిన్నంగా.. జనసేన వ్యవహారం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రారంబించిన జనసేన పార్టీపై ప్రజల్లో ఎక్కడా చర్చ సాగడం లేదు. పార్టీ పెట్టి 8 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటి వరకు జనసేన నాయకులు జెండా లేకుండా వెళ్లినా.. పవన్ ఫొటో లేకుండా వెళ్లినా.. ప్రజలు గుర్తు పట్టే పరిస్థితి లేదు.
ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఇలాంటి సంఘటన ఎదురైంది. దీంతో ఖంగుతిన్న నాయకులు ఈ విషయంపై పవన్కు సమాచారం అందించారు. “సార్ మనల్ని ఎవరూ గుర్తు పట్టడం లేదు సార్” అంటూ.. ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే.. దీనిని పవన్ ఎలా తీసుకున్నారో తెలియదు.. కానీ.. మళ్లీ పరిస్థితి మాత్రం మామూలే! కట్ చేస్తే.. ఈ ఎనిమిదేళ్లలో పట్టుమని.. మూడు మాసాలు కూడా ప్రజల్లో జనసేన గురించి చర్చ అయితే.. జరగేలేదనేది వాస్తవం.
ఎలా చూసుకున్నా.. పవన్ ప్రజల మధ్య ఒక్క మూడు మాసాలు లేదా.. కనీసం 50 రోజలు పాటు.. ఆయన పర్యటించింది లేదు. హడావుడిగా రావడం.. ఓ మూడు రోజులు మురిపించడం.. వెంటనే వెళ్లిపోవడం. ఇదే తంతు కొనసాగుతోంది. ఉన్న మూడు రోజులు కూడా.. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఈ మాట ఎవరో అనడం కాదు.. నేరుగా.. పవన్ సామాజికవ ర్గానికి చెందిన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఎంత సామాజిక వర్గం అభిమానం ఉన్నా.. ప్రజలు ఓట్లు వేయాలంటే.. నాయకులను గుర్తు పట్టాలి.
నాయకులు తమ మధ్య ఉండాలని కోరుకుంటారు. ఈ రెండు విషయాల్లోనూ జనసేన ఫుల్లుగా ఫెయిల్ అయింది. కేడర్ లేదు. నాయకులు లేరు. ఉన్నవారు బయటకు రారు. వచ్చినా.. ప్రజలు గుర్తు పట్టే పరిస్థితి లేదు. దీనికి కారణం.. టీడీపీ మాదిరిగానో.. వైసీపీ మాదిరిగానో.. జనసేన నాయకులు జనంలో ఉండరు. అంతేకాదు.. ఏదైనా కీలక విషయాన్ని లేవనెత్తి.. ఆ విషయంపై సుదీర్ఘ పోరాటం చేసే వ్యూహం కూడా అనుసరించరు. దీంతో ప్రజలు జనసేన నాయకులను గుర్తు పట్టే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక, పార్టీ తరఫున సభలు.. సమావేశాలు.. నాయ కులను క్షేత్రస్థాయిలోకి పంపించడం.. కార్యకర్తలను ప్రొత్సహించడం వంటివి లేకపోవడంతో పార్టీ గురించిన చర్చ .. ఎక్కడా జరగడం లేదు. అంతేకాదు.. నాయకులు సైతం పలచగా ఉండడం.. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో వారికి ఎలాంటి పాత్ర లేకపోవడం.. మరో విచిత్రం. దీంతో జనసేన పుంజుకుంటున్న దాఖలా మాట అలా ఉంచితే.. “పవన్ వస్తే..పార్టీ” అనే మాట వినిపిస్తోంది. ఇదే పరిస్తితి కొనసాగితే.. ప్రజల్లో నమ్మకం ఎలా కలుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 9, 2022 9:10 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…