Political News

తెలంగాణ టు ఏపీ.. వైకాపా ఎమ్మెల్యేకు కరోనా

కరోనా మహమ్మారికి చిన్నా పెద్దా.. రాజు పేద అని తేడాలేమీ ఉండట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులను ఆ వైరస్ పలకరించింది. ఏకంగా బ్రిటన్ ప్రధానే కరోనా బాధితుడిగా మారారు. మన దేశం విషయానికి వస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు దీని బారిన పడ్డారు. తమిళనాట ఓ ఎమ్మెల్యే సైతం కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వాళ్లు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలోనూ తొలిసారిగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఆయనే శ్రీనివాసరావు. ఏపీలో అత్యంత ఆలస్యంగా కరోనా బారిన పడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఈయన. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గానికి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ముందుగా ట్రూనాట్‌ టెస్ట్‌లో ఎమ్మెల్యేకు పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఆ తర్వాత నిర్వహించిన టీపీసీఆర్‌ పరీఓలోనూ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా ఉన్నట్లు తేలింది. ఆయనకే కాదు.. తన గన్ మ్యాన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో శ్రీనివాసరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఈ నెల 10న అమెరికా నుంచి స్వస్థలానికి వచ్చారు. అమెరికా నుంచి వచ్చాక పరీక్షలు చేయించుకోగా ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. కానీ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. తాజా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో ఎమ్మెల్యే శ్రీనివాసరావు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఇక్కడి నుంచే వైద్యుల సూచనతో చికిత్స పొందుతోంది. ఎమ్మెల్యే గన్‌మ్యాన్‌ను కూడా హోం క్వారంటైన్లో ఉంచే చికిత్స చేయిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా, ఇంకా వేర్వేరు సమయాల్లో ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఇప్పుడు ఆందోళన నెలకొంది.

suman

Recent Posts

పెద్ద‌ల స‌భ‌కు విజ‌య్‌.. మంచిదేనా.. ?

అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…

2 hours ago

హైదరాబాద్‌లో ఎకరం ఎంతంటే..

భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…

3 hours ago

చందమామ గ్లామర్ ఎటాక్.. పట్టించుకుంటారా?

టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…

4 hours ago

వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వం!

2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…

4 hours ago

మ‌రీ ఎక్కువ చెప్పినా క‌ష్ట‌మేమో పెద్దీ..

కొత్త సినిమాల‌కు ప్ర‌మోష‌న్ త‌గ్గినా క‌ష్ట‌మే. ప్రచారం మ‌రీ ఎక్కువైనా ప్ర‌మాద‌మే. వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌మోష‌న్లు చేసి జ‌నం దృష్టి…

5 hours ago

టీడీపీ ప్లాన్ సక్సెస్ అయితే రాజకీయాలు మారిపోతాయా?

టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…

5 hours ago