Political News

కేసీఆర్ క‌రుణ ద‌క్కేది ఎవ‌రికి? రాజ్య‌స‌భ రేసులో కొత్త ముఖాలు

టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ క‌రుణ కోసం.. నేత‌లు త‌హ‌త‌హలాడుతున్నారు. ఆయ‌న త‌మ‌ను క‌రుణించాల‌ని.. నేత‌లు దేవుళ్ల‌ను మొక్కుతున్నారు. దీనికి కార‌ణం.. త్వ‌ర‌లోనే మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు ఉండ‌డమే! ఈక్ర‌మంలో కేసీఆర్‌ ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. 2018 ఏప్రిల్‌ 3న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా పరిణామాల అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌.. ప్రకాశ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరో రెండున్నరేళ్ల పదవీకాలానికి ముందే ఆయన గత డిసెంబరు 4న రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. తాజాగా ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఎన్నికయ్యే అభ్యర్థికి 2024 ఏప్రిల్‌ వరకు అంటే 23 నెలల పదవీకాలం మాత్రమే ఉంటుంది. మరోవైపు మరో ఇద్దరు టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెల 22 వరకు ఉంది. ఈ గడువుకు 25 రోజుల ముందే అంటే నెలాఖరుకు ఈ రెండు స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.

ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేరు పరిశీలనలో ఉంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చురుకైన పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో విస్తృత పరిచయాలు, ఎంపీగా అనుభవం ఉన్న ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపే రాజ్యసభ ఉప ఎన్నిక జరిగే ఈ స్థానానికి పదవీకాలం ముగుస్తుంది. దీంతో వినోద్‌ను మళ్లీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇబ్బందులూ ఉండవు.

వినోద్‌ను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగించాలని అనుకుంటే ఆయనకు బదులు నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు పేరును పరిశీలించే వీలుంది. మరోవైపు మిగిలిన రెండు రాజ్యసభ స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే ఆశావహుల జాబితా భారీగా ఉంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి గత పార్లమెంటు ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో నామా నాగేశ్వరరావును బరిలోకి దింపగా గెలిచారు. ప్రస్తుతం ఆయ‌న లోక్‌సభాపక్ష నేతగా ఉన్నారు.

ఈక్రమంలో పొంగులేటికి రాజ్యసభ టికెట్‌ ఇచ్చే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇంకా మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌, బూర నర్సయ్య గౌడ్‌, టీఎస్ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తదితరుల పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఇప్పుడు కేసీఆర్ క‌రుణ కోసం ఎదురు చూస్తున్నారు.

This post was last modified on May 6, 2022 2:45 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రభాస్ ప్రభావం – కమల్ వెనుకడుగు

ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…

10 hours ago

ట్రెండ్ సెట్టర్ రవిప్రకాష్.! మళ్ళీ మొదలైన హవా.!

సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్‌ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…

10 hours ago

శ్యామల పొలిటికల్ కథలు.! ఛీటింగ్ సినిమా.!

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల…

10 hours ago

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

14 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

16 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

16 hours ago