Political News

పీకే పాదయాత్రకు మాత్రమే పరిమితమా ?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తన రాజకీయ భవిష్యత్తును ఆవిష్కరించారు. మీడియాతో మాట్లాడుతు రాజకీయపార్టీ పెట్టే ఆలోచనేదీ తనకు లేదని స్పష్టంగా ప్రకటించారు. అయితే పనిలోపనిగా పాదయాత్ర మాత్రం చేయబోతున్నట్లు చెప్పారు. జన్ సురాజ్ పేరుతో అక్టోబర్ 2వ తేదీ నుంచి బీహార్ లో సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు పీకే రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జన్ సూరజ్ వేదికే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశాలను వివరించారు. ఇక్కడ విషయం ఏమిటంటే పీకే తొందరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే ఆ ప్రచారమంతా కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. రాజకీయ వ్యూహకర్త స్ధాయి నుండి రాజకీయ నేతగా అవతరించాలని పీకేలో బలమైన ఆకాంక్ష కనబడుతోంది.

అయితే ఆ ఆకాంక్ష ఏదైనా పార్టీలో చేరటం వల్ల నెరవేరుతుందేమో కానీ సొంతంగా పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం తక్కువే. ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తలకు జనాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. 24 గంటలూ జనాలతోనే తిరుగుతున్న రాజకీయ నేతలకే ఆదరణ దక్కటం అంతంతమాత్రంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టుగా పార్టీ పెట్టేసి పెద్ద నేత అయిపోదామని పీకే అనుకుంటే ఫెయిలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కొంతకాలంగా దేశంలోని అనేక రాజకీయపార్టీలతో కలిసి పీకే పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాను పనిచేసిన వారిలో నితీష్ కుమార్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, మమతాబెనర్జీ, స్టాలిన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పీకే ఫెయిల్యూర్లు కూడా ఉన్నాయి. అయితే ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. దాంతో తనపై తనకు బాగా నమ్మకం పెరిగిపోయినట్లుంది. అందుకనే రాజకీయ వ్యూహకర్త అనేకన్నా రాజకీయ నేతల వాసనలే ఎక్కువైపోయాయి. సరే ఏదేమైనా చివరి నిముషంలో వాస్తవాలు గ్రహించినట్లున్నారు. అందుకనే ప్రస్తుతానికి పాదయాత్రకు మాత్రమే పరిమితమైపోదామని డిసైడ్ అయ్యారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

4 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

7 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

7 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

8 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

8 hours ago