నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమా లేదంటే ముందస్తు ఎన్నికల ప్లాన్ ఉందా అనే అంచనాలు పక్కనపెడితే… తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని ప్రతిపక్షాల వరకు ఈ ఎత్తుగడల్లోనే బిజీగా ఉన్నాయి. అయితే, రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యం అయితే టీఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇటు సోషల్ మీడియాతో పాటు ఇటు రాజకీయ వేదికలపై అధికార పార్టీ చేస్తున్న కామెంట్లు, వ్యవహరిస్తున్న తీరుతో రాబోయే ఎన్నికలను టీఆర్ఎస్ రెడీ చేసుకుందని చెప్తున్నారు. అధికార పార్టీ వ్యూహం మొత్తం అటు ఢిల్లీ, లేదంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల చుట్టే చక్కర్లు కొడుతుందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. దీనికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గత కొద్దికాలంగా స్పందిస్తున్న తీరును ఉదహరిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన బెంగళూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రోజూ కరెంట్ కట్ చేస్తున్నారని ఓ పారిశ్రామికవేత్త ట్వీట్ చేయగా దీనికి కేటీఆర్ రియాక్ట్ అవుతూ.. బ్యాగులు ప్యాక్ చేసుకొని హైదరాబాద్కు వచ్చేయాలని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని తెలిపారు. దీనికి కొనసాగింపుగా, ‘ఏపీలో కరెంటు లేదు’ అనే కామెంట్ పక్క రాష్ట్రాల కంటే తాము ఎంత మేలన్నది తెలియజేశారు.
ఏప్రిల్ 27న నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ కేంద్రమే టార్గెట్గా కొనసాగింది. ప్లీనరీలో 13 తీర్మానాలు చేస్తూ మొత్తం కేంద్రానికి వ్యతిరేకంగా చేసినవే. పార్టీ చీఫ్ కేసీఆర్, ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్రావు సహా ఎమ్మెల్యేల వరకు కేంద్రంపైనే విమర్శలు చేశారు. అంతకుముందు వడ్ల కొనుగోళ్లపై ఇందిరాపార్క్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేసింది. తెలంగాణలో వడ్లను ఎఫ్సీఐ కొనాలనే వాదనతో ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షకు దిగింది. సెంటిమెంట్ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ రాబోయే ఎన్నికలకు తమ అజెండాగా… పొరుగు రాష్ట్రాలతో పోలిక, కేంద్రం శీతకన్ను అజెండాతో ముందుకు సాగుతోందని ఇవే ఎన్నికల వ్యూహాలని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on May 4, 2022 3:24 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…