తెలంగాణలో ఇంటి పార్టీ ని ఢీ కొనడం రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదు. గులాబీ దండు బాగానే ఉంది. పనిచేస్తుంది. విమర్శలు ఉన్నా, ఆర్థిక సంబంధ ఆరోపణలు నేరాలు ఉన్నాక కూడా బాగానే పేరు తెచ్చుకుంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఎక్కువగా వచ్చిన విమర్శలు క్రమంగా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అంటే ఆ పార్టీ ద బెస్టు అని కాదు కానీ, వాటిపై ఎన్ని సార్లు మాట్లాడినా జనం పెద్దగా ఆకర్షితులు కావడం లేదు.
ఫాం హౌస్ రాజకీయం పై కానీ లేదా జాగృతికి సంబంధించి కానీ విపక్షాలు ఏం మాట్లాడినా ఆఖరికి డ్రగ్ ఛాలెంజ్ పై కూడా మాట్లాడినా ఎవ్వరూ పెద్దగా పరిగణించడం లేదు. అందుకు గాంధీ భవన్ కారణం. ఒక నాడు ఆ నందన వనాన వికసించిన పూలు లేవు. ఉన్నవన్నీ ముళ్లే !
ఒకనాడు అధికార దర్పంతో ఊగిపోయిన వాళ్లంతా వయస్సు మీరి పోయిన వారయిపోయారు. రేవంత్ డీఎన్ఏ పై ఇప్పటికీ చర్చలు నడుస్తున్నందున ఆయనను కోమటిరెడ్డి మరియు జగ్గారెడ్డి అంగీకరించారు. వీళ్లందరిదీ ఓ దారి వీహెచ్ లాంటి నేతలది మరో దారి. దారి ఎలా ఉన్నా కూడా గాంధీభవన్ వాస్తు మార్చినా కూడా వాస్తవాలు మాత్రం మారిపోవడం లేదు. ఈ దశలో పార్టీకి పూర్వ వైభవం దక్కడం కష్టం కానీ కనీసం పరువు నిలబెట్టుకుంటే చాలు అన్న వాదనకు బలం చేకూర్చేందుకు రేవంత్ రెడ్డి (పీసీసీ బాస్) ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇందుకు ఆయన పాదయాత్ర ఒక్కటే ప్రథమావధి అని, పరమావధి అని భావించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే హై కమండ్ మాత్రం ఆయనకు మద్దతుగా లేదు. దీంతో పాదయాత్రకు ఆయనొక కొత్త భాష్యం చెప్పారు. తనకు 119 రోజులు చాలు అని, రోజుకో నియోజక వర్గం తిరిగి వస్తానని, పాదయాత్ర అంటే ఇంటిటికీ తిరిగి రావడం కాదని అన్నారు. బాగుంది ఈ పాటి లాజిక్కు వైఎస్ కు తెలియకపోవడం వల్లనేమో ఆయన అంత కష్టపడ్డారు. అదీ ఉమ్మడి రాష్ట్రంలో ! కనీస స్థాయి ఆలోచన లేకుండా కూడా మన నాయకులు మాట్లాడి ఎందుకని నవ్వులు పాలవుతారో ! కదూ!
This post was last modified on May 4, 2022 9:38 am
ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…
ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…