తెలంగాణలో ఇంటి పార్టీ ని ఢీ కొనడం రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదు. గులాబీ దండు బాగానే ఉంది. పనిచేస్తుంది. విమర్శలు ఉన్నా, ఆర్థిక సంబంధ ఆరోపణలు నేరాలు ఉన్నాక కూడా బాగానే పేరు తెచ్చుకుంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఎక్కువగా వచ్చిన విమర్శలు క్రమంగా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అంటే ఆ పార్టీ ద బెస్టు అని కాదు కానీ, వాటిపై ఎన్ని సార్లు మాట్లాడినా జనం పెద్దగా ఆకర్షితులు కావడం లేదు.
ఫాం హౌస్ రాజకీయం పై కానీ లేదా జాగృతికి సంబంధించి కానీ విపక్షాలు ఏం మాట్లాడినా ఆఖరికి డ్రగ్ ఛాలెంజ్ పై కూడా మాట్లాడినా ఎవ్వరూ పెద్దగా పరిగణించడం లేదు. అందుకు గాంధీ భవన్ కారణం. ఒక నాడు ఆ నందన వనాన వికసించిన పూలు లేవు. ఉన్నవన్నీ ముళ్లే !
ఒకనాడు అధికార దర్పంతో ఊగిపోయిన వాళ్లంతా వయస్సు మీరి పోయిన వారయిపోయారు. రేవంత్ డీఎన్ఏ పై ఇప్పటికీ చర్చలు నడుస్తున్నందున ఆయనను కోమటిరెడ్డి మరియు జగ్గారెడ్డి అంగీకరించారు. వీళ్లందరిదీ ఓ దారి వీహెచ్ లాంటి నేతలది మరో దారి. దారి ఎలా ఉన్నా కూడా గాంధీభవన్ వాస్తు మార్చినా కూడా వాస్తవాలు మాత్రం మారిపోవడం లేదు. ఈ దశలో పార్టీకి పూర్వ వైభవం దక్కడం కష్టం కానీ కనీసం పరువు నిలబెట్టుకుంటే చాలు అన్న వాదనకు బలం చేకూర్చేందుకు రేవంత్ రెడ్డి (పీసీసీ బాస్) ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇందుకు ఆయన పాదయాత్ర ఒక్కటే ప్రథమావధి అని, పరమావధి అని భావించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే హై కమండ్ మాత్రం ఆయనకు మద్దతుగా లేదు. దీంతో పాదయాత్రకు ఆయనొక కొత్త భాష్యం చెప్పారు. తనకు 119 రోజులు చాలు అని, రోజుకో నియోజక వర్గం తిరిగి వస్తానని, పాదయాత్ర అంటే ఇంటిటికీ తిరిగి రావడం కాదని అన్నారు. బాగుంది ఈ పాటి లాజిక్కు వైఎస్ కు తెలియకపోవడం వల్లనేమో ఆయన అంత కష్టపడ్డారు. అదీ ఉమ్మడి రాష్ట్రంలో ! కనీస స్థాయి ఆలోచన లేకుండా కూడా మన నాయకులు మాట్లాడి ఎందుకని నవ్వులు పాలవుతారో ! కదూ!
This post was last modified on May 4, 2022 9:38 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…