Political News

పార్టీలో గొడవలు.. లక్ష్యం మాత్రం ఒక్కటే: రేవంత్

కాంగ్రెస్ పార్టీని పరేడ్ గ్రౌండ్ తో పోల్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారులో సదరు యాంకర్ పార్టీలోని విబేధాల గురించి ప్రస్తావించారు. దానికి రేవంత్ సమాధానమిస్తూ  పరేడ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటోళ్ళు ఆడుతుంటారు. ఫుట్ బాల్ ఆడేవాళ్ళు ఆడుతుంటారు. బాడ్మింటన్ ఒకపక్క ఆడుతుంటారు, బాస్కెట్ బాల్ ఆడుతుంటారన్నారు. గ్రౌండ్ లో ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు అయితే ప్రత్యర్ధులతో మ్యాచ్ వచ్చినపుడు ఆట ఆడేవాళ్ళంతా ఒకటైపోతారని చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ కు వ్యతిరేకంగా ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు జగ్గారెడ్డి, ఇంకోవైపు వీహెచ్ లాంటి సీనియర్లు చాలామంది రాజకీయాలు చేస్తుంటారు. వీళ్ళంతా రేవంత్ కు వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో రెచ్చిపోతున్నారు. నేరుగా నిలదీసేవాళ్ళు రేవంత్ ను నిలదీస్తున్నారు. ఏఐసీసీ నేతలకు కంప్లైంట్ చేసేవాళ్ళు చేస్తుంటారు. అలాగే సోనియాగాంధీకి ఫిర్యాదులు చేసేవాళ్ళు చేస్తుంటారు. మళ్ళీ గాంధీభవన్లో మీటింగ్ పెట్టి అందరూ కేసీయార్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతారు.

ఇదే విషయాన్ని రేవంత్ ప్రస్తావిస్తూ తనను వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తునే ఉంటారు మళ్ళీ కలిసేవాళ్ళు కలుస్తునే ఉంటారని చెప్పారు. అయితే తమలో తమకు ఎన్ని విబేధాలున్నా కేసీయార్ ను గద్దెదించే విషయంలో మాత్రం అందరం కలిసే పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. నేతల మధ్య విబేధాలు ఉండటం కాంగ్రెస్ పార్టీలో చాలా సహజమన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విబేధాలు ఇప్పటివి కావని గాంధీ మహాత్ముడికి సుభాష్ చంద్రబోస్ మధ్య కూడా విబేధాలున్నాయని గుర్తుచేశారు.

ఒక అంశం మీద నేతల మధ్య అనేక రకాలుగా అభిప్రాయాలుండటమే కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని సమర్ధించుకున్నారు. ఎవరే పద్దతుల్లో పనిచేస్తున్నా కేసీయార్ మరో పదేళ్ళు అధికారంలో ఉండాలని కాంగ్రెస్ నేతల్లో ఎవరైనా చెప్పగలరా ? అని యాంకర్ ను ప్రశ్నించారు. ఎవరేపద్దతిలో పనిచేస్తున్న రాహుల్ గాంధీ పాల్గొనే  వరంగల్ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయటమే తమ లక్ష్యమన్నారు.

Satya

Recent Posts

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

16 minutes ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

3 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

3 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

3 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

4 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

4 hours ago