త్వరలోనే అధికార వైసీపీ నేతలు.. ఇంటింటికీ వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడమే లక్ష్యంగా పార్టీ అధినేత జగన్.. వేస్తున్న అడుగుల్లో ఇది 2024 ఎన్నికలకు సంబంధించిన కీలక అంశంగా మారుతుంది. జగన్ ఆదేశాల మేరకు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు.. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్లాలి. ఇంటింటికీ తిరగాలి. వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరించాలి.
వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని గెలిపించాలని ప్రజలకు పిలుపు ఇవ్వాలి. ఇంత వరకు బాగానే ఉంది. నాయకులు కదిలేందుకు రెడీగానే ఉన్నారు. ప్రజలను కలుసుకుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా వివరిస్తారు. అయితే. ఇక్కడ జగన్ టార్గెట్ పెట్టిన.. ప్రజలు.. వేరు.. రేపు తాము కలుస్తున్న జనాలు వేరు. ఎలాగంటే.. జగన్ ఏం చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి.. వారిని కలవాలని చెబుతున్నారు. ప్రభుత్వం వారికి ఏం చేస్తోందో వివరించాలని అంటున్నారు.
కానీ, ఇదే విషయంలో వైసీపీ నేతల మధ్య తీవ్రమైన ఆవేదన , ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఎలాగంటే.. సమాజంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న లబ్ధి దారులు కేవలం 22 శాతం మంది ఉన్నారు. అంటే. ప్రభుత్వం నుంచి వీరు.. వివిధ రూపాల్లో నిధులు సంక్షేమం కింద తీసుకుంటున్నారు. మిగిలిన వారు.. అంటే.. 78 శాతం మంది ప్రజలు మాత్రం వివిధ రూపాల్లో పన్నులు ప్రభుత్వానికి కడుతున్నారు. అంటే.. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణలేదు.
సో.. రేపు మేం.. ప్రజలను కలిస్తే.. ఎలాంటి లబ్ధి పొందని వారినే ఎక్కువగా కలవాల్సి ఉంటుంది. వీరంతా ఇప్పుడు.. అనేక పన్నుల పెంపు.. పెట్రోల్ దరలు, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీల పెంపు.. ఇలా అనేక అంశాలను ప్రశ్నిస్తారనేది.. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా పడుతున్న ఆవేదన. అందుకే.. ఇప్పటికిప్పుడు.. వెళ్లడం సరికాదనేది.. సీనియర్ల మాట. అంతేకాదు.. ఈ వర్గాలకు కూడా.. జగన్ ఏదైనా చేయాలి! అనేది వీరి డిమాండ్గా ఉంది. అప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లినా.. ప్రయోజనం లేదని చెబుతున్నారు.
This post was last modified on May 2, 2022 6:46 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…