Political News

వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. జ‌న‌సేన టార్గెట్ ఎంత‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం.. ఖాయ‌మ‌ని.. ఆ పార్టీ అధినేతే ప‌లుమార్లు ఇటీవ‌ల కాలంలో వ్యాఖ్యానించారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ల‌క్ష్యం అధికార‌మే అనే విష‌యం అంద‌రికీ అర్ధ‌మైంది. ఓకే.. మ‌రి టార్గెట్ ఎంత‌?  ఎన్ని స్థానాల్లో విజ‌యం సాధించాలని.. ల‌క్ష్యంగా పెట్టుకుని.. ఎన్ని స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్నారు? అనేది ఇప్పుడు జ‌న‌సేన గురించిన ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. ఎందుకంటే.. కొన్ని కీల‌క కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం అధికార పార్టీ వైసీపీ ఒక నిర్ణీత ల‌క్ష్యాన్ని దాదాపు పెట్టుకుంది. కుదిరితే క‌ప్పు కాఫీ అన్న‌ట్టుగా.. కుదిరితే మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం ద‌క్కించుకోవాల‌ని.. లేక‌పోతే.. ఇప్పుడున్న స్థానాల‌ను 151 స్థానాల‌ను నిల‌బెట్టుకోవాల‌ని.. నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తును కూడా మే 10 నుంచే ప్రారంబించ‌నుంది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ఒక ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 160 సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.

లేక‌పోతే.. క‌నీసం 100 స్థానాల‌నైనా గెల‌వాల‌ని.. టీడీపీ నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో ఈ పార్టీ కూడా ముందుకు క‌దులుతోంది. జూన్ నుంచి యాత్ర‌లు ప్రారంభించనుంది. అయితే.. ఇప్పుడు ఎటొచ్చీ.. జ‌నసేన ల‌క్ష్యం ఏంట‌నేది ముఖ్యంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. ప‌దే ప‌దే చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను కదిలించ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లు కూడా లేరు. ఇక‌, మండ‌ల‌స్థాయిలో బూత్ క‌మిటీలు లేవు.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా.. బ‌ల‌మైన ల‌క్ష్యం అంటూ ఉండాలి క‌దా?. అది ఏది?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తాం.. అనే కామ‌న్ డైలాగు పేల్చ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది. నిర్దిష్టంగా ఇన్ని సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకుంటాం.. అని క‌నుక నిర్ణ‌యించుకుంటే.. అంటే.. 100 లేదా 150 లేదా 170 ఇలా.. ఏదో ఒక ఫిగ‌ర్ నిర్ణ‌యిస్తే.. దాని ప్ర‌కారం.. జ‌న‌సైన్యాన్ని ముందుకు న‌డిపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి జ‌న‌సేనాని.. ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

3 hours ago