తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు రాజకీయ వేడి రెండువైపులా పెరిగిపోతోంది. ఈనెల 6వ తేదీన వరంగల్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కూడా వేదిక మీదకే తీసుకొచ్చి మాట్లాడించబోతున్నారు. వారితో రాహుల్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు.
అంటే రాహుల్ సభలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే ఎక్కువగా హైలైట్ అయ్యే అవకావముంది. తర్వాత విద్యార్ధులు, నిరుద్యోగులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అనుమతివ్వలేదు. కాబట్టి వాళ్ళతో ముఖాముఖి ఎక్కడ జరుగుతుందో తెలీదు. రెండు రోజులపాటు రాహుల్ తెలంగాణ లో పర్యటించబోతున్నారు. కాబట్టి కచ్చితంగా ఈ వేడి కేసీయార్ కు తగలుతుంది.
ఇదే సమయంలో ఒక్కరోజు ముందు అంటే ఈనెల 5వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహబూబ్ నగర్ పర్యటించబోతున్నారు. మహబూబ్ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగబోతోంది. ఇది కూడా రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా జరగబోతోంది. కాబట్టి బీజేపీ కారణంగా మరింత వేడి రాజుకోబోతోంది. అంటే ఒకవైపు రాహుల్ రెండు రోజుల పర్యటన మరోవైపు జేపీ నడ్డా ఒక్కరోజు పర్యటన.
అంటే మూడు రోజులు వరుసగా కేసీయార్ కు రెండు పార్టీల నేతల నుండి సెగ తగలటం ఖాయమనే అనుకోవాలి. అసలే వాతావరణం కారణంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లోనే రెండు పార్టీల అగ్రనేతలు, వాళ్ళకు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అండ్ కో, బండి సంజయ్ అండ్ కో చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందులోను రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత రాహుల్ మొదటిసారిగా తెలంగాణాలో అడుగుపెడుతున్నారు. కచ్చితంగా తన సామర్ధ్యాన్ని నిరూపించేందుకు రేవంత్ నూరుశాతం ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు నడ్డా ముందు బండిసంజయ్ కూడా ప్రయత్నిస్తారు. ఎలా చూసుకున్నా రెండువైపుల నుండి కేసీయార్ కు వేడి తగలటం ఖాయమనే అనిపిస్తోంది.
This post was last modified on May 2, 2022 10:39 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…