Political News

చీర‌ల రాజ‌కీయమా.. చిల్ల‌ర రాజ‌కీయ‌మా!!

రాజ‌కీయం అన్నాక‌.. ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల మధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు స‌హ‌జం అయితే.. దీనికి కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి. మంత్రిగా ఉన్న నాయకులు. కీల‌క‌మైన పోస్టుల్లో ఉన్న వారు.. ఆచితూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అయితే.. ఈ రేఖ‌ను తుడిచేస్తున్న‌.. టీడీపీ.. వైసీపీ నాయ‌కులు… చేస్తున్న రాజ‌కీయాలు తీవ్ర వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయి. అదేస‌మ‌యంలో ఆయా పార్టీల అభిమానుల‌ను కూడా క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

ఎందుకంటే.. తాజాగా ఈ రెండు పార్టీల మ‌ధ్య చోటు చేసుకున్న “చీర‌ల రాజ‌కీయం“ చిల్లర రాజ‌కీయంగా మారుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. “రాజ‌కీయాలు హ‌ద్దు అదుపు లేకుండా పోతోంది. గ‌తంలో నాయ‌కులు మీడియా ముందుకు వ‌స్తే.. రాష్ట్ర అభివృద్ధి గురించి.. స‌మ‌స్య‌ల గురించి.. ఉన్న‌త స్థాయిలో ఆలోచ‌న‌లు పంచుకునేవారు. ఇప్పుడు.. మీడియా ముఖం చూడాలంటేనే.. బాధ‌ప‌డుతున్నాం. ఆ పార్టీ ఈపార్టీ అని తేడాలేదు. ఎవ‌రికివారు రేటింగ్ కోసం.. చేస్తున్న ప్ర‌య‌త్నాలు బాధ‌పెడుతున్నాయి“ అని మేధావులు సైతం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌ల మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోజా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ ల‌ను ఉద్దేశించి.. చీర‌లు పంపించ‌మంటారా?  చుడీదార్లు పంపించ‌మంటారా? అని వ్యాఖ్యానించారు. నిజానికి ఒక మ‌హిళ అయి ఉండి.. పైగా బాధ్య‌తాయుత మంత్రి అయి ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై మేధావులే విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇక‌, దీనిని టీడీపీ అక్క‌డితో వ‌దిలేయ‌కుండా.. కొన‌సాగింపు రాజ‌కీయం చేసింది. పార్టీ మ‌హిళా నేత‌.. ఒక‌రు.. సీఎం జ‌గ‌న్‌కు ఏ చీర పంపించ‌మంటార‌ని వ్యాఖ్యానించారు.

దీంతో ఈ విష‌యం మ‌రింత రాజుకుంది. ఇక‌, ఈ విష‌యంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కూడా వ్యాఖ్య‌లు చేశారు. మీరు పంపించే చీర‌ను మా అమ్మ‌కు పంపిస్తాన‌న్నారు. త‌ప్ప‌.. రాజ‌కీయాల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎందుక‌ని.. లోకేష్ కూడా ప్ర‌శ్నించలేదు. దీనిని ఖండించ‌నూ లేదు. దీంతో ఈ రాజ‌కీయాలు చూస్తున్న మేధావులు.. ఇలాంటి రాజ‌కీయాల‌తో ఏపీ ప‌రువు పోతోంద‌ని అంటున్నారు. రెండు పార్టీలూ.. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెప్పుకొంటున్న‌ప్పుడు.. ఇలా.. చీర‌ల రాజ‌కీయం చేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

This post was last modified on May 1, 2022 7:16 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago