రాజకీయం అన్నాక.. ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం అయితే.. దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మంత్రిగా ఉన్న నాయకులు. కీలకమైన పోస్టుల్లో ఉన్న వారు.. ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే.. ఈ రేఖను తుడిచేస్తున్న.. టీడీపీ.. వైసీపీ నాయకులు… చేస్తున్న రాజకీయాలు తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అదేసమయంలో ఆయా పార్టీల అభిమానులను కూడా కలవరపెడుతున్నాయి.
ఎందుకంటే.. తాజాగా ఈ రెండు పార్టీల మధ్య చోటు చేసుకున్న “చీరల రాజకీయం“ చిల్లర రాజకీయంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. “రాజకీయాలు హద్దు అదుపు లేకుండా పోతోంది. గతంలో నాయకులు మీడియా ముందుకు వస్తే.. రాష్ట్ర అభివృద్ధి గురించి.. సమస్యల గురించి.. ఉన్నత స్థాయిలో ఆలోచనలు పంచుకునేవారు. ఇప్పుడు.. మీడియా ముఖం చూడాలంటేనే.. బాధపడుతున్నాం. ఆ పార్టీ ఈపార్టీ అని తేడాలేదు. ఎవరికివారు రేటింగ్ కోసం.. చేస్తున్న ప్రయత్నాలు బాధపెడుతున్నాయి“ అని మేధావులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లను ఉద్దేశించి.. చీరలు పంపించమంటారా? చుడీదార్లు పంపించమంటారా? అని వ్యాఖ్యానించారు. నిజానికి ఒక మహిళ అయి ఉండి.. పైగా బాధ్యతాయుత మంత్రి అయి ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మేధావులే విస్మయం వ్యక్తం చేశారు. ఇక, దీనిని టీడీపీ అక్కడితో వదిలేయకుండా.. కొనసాగింపు రాజకీయం చేసింది. పార్టీ మహిళా నేత.. ఒకరు.. సీఎం జగన్కు ఏ చీర పంపించమంటారని వ్యాఖ్యానించారు.
దీంతో ఈ విషయం మరింత రాజుకుంది. ఇక, ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వ్యాఖ్యలు చేశారు. మీరు పంపించే చీరను మా అమ్మకు పంపిస్తానన్నారు. తప్ప.. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని.. లోకేష్ కూడా ప్రశ్నించలేదు. దీనిని ఖండించనూ లేదు. దీంతో ఈ రాజకీయాలు చూస్తున్న మేధావులు.. ఇలాంటి రాజకీయాలతో ఏపీ పరువు పోతోందని అంటున్నారు. రెండు పార్టీలూ.. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకొంటున్నప్పుడు.. ఇలా.. చీరల రాజకీయం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…