Political News

5 కోట్ల కంటే సందేశం గొప్పది

గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.5 కోట్లు, ఇంటి స్థలం, ఆయన భార్య సంతోషికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

ఈ ప్రకటన వెనుక రాజకీయ కోణం ఉన్నదని భావించిన వారు లేదా సోషల్ మీడియా, ప్రతిపక్షాల ప్రోద్భలం ఉందని భావించినప్పటికీ, ఏదేమైనా అంతకు మించి ఆర్మీలో చేరాలనుకునే వారికి భరోసా కల్పించినట్లవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికీ కొంతమంది ఆర్మీలోకి వెళ్లేందుకు ఆసక్తి కనబరచని వారు ఉన్నారు లేదా తల్లిదండ్రులు కూడా పంపించేందుకు భయపడేవారు ఉంటారు. కానీ ఇలాంటి ప్రకటన వల్ల ఆ కుటుంబానికి భరోసా కల్పించడంతో పాటు తమకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన గౌరవం దక్కుతుందనే అభిప్రాయం చాలామందిలో రావడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.

దేశం మీద ప్రేమతో ఎవరైనా ఆర్మీలోకి వెళ్దామనుకునే వారు ఉంటారు. అయితే తన తర్వాత తన ఫ్యామిలీ ఏమిటనే ప్రశ్న ఉదయించి ఆగిపోయే వారు ఉంటారు. అలాంటి వారికి తన కుటుంబం జీవితం సాఫీగా సాగిపోతుందనే భరోసా ఇచ్చేందుకు ఇలాంటి ప్రకటనలు ఉపయోగ పడతాయంటున్నారు.

కేసీఆర్ ప్రకటన దేశమంతా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అంతకుమించి సూర్యాపేట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కేసీఆర్ సంతోష్ బాబు అంత్యక్రియలకు హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చి ఉండవచ్చు. ఈ రాజకీయ విమర్శల భయంతో ఆ తర్వాత నేరుగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలిసి వీటిని అందించవచ్చు. ఈ రాజకీయ అంశాలు పక్కన పెడితే మాత్రం ఇక ముందు ఆర్మీలోకి వెళ్లేవారికి లేదా వారి కుటుంబానికి భరోసా, గౌరవం కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం మాత్రం ప్రజల్లోకి వెళ్తుందంటున్నారు.

Satya

Recent Posts

బహదూర్ VS బంధం – ఆషామాషీ పోటీ కాదు

స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…

49 minutes ago

కిచిడీ కామెడీకి వంద కోట్ల వసూళ్లు

దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…

51 minutes ago

తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…

2 hours ago

ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…

2 hours ago

సూర్య సరైన దారిలోకి వచ్చినట్టే

ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…

3 hours ago

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…

5 hours ago