Political News

లక్ష మందితో మహానాడు

ఒంగోలులో మే నెల 27,28 తేదీల్లో జరగబోయే టీడీపీ మహానాడుకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా. మహానాడు నిర్వహణపై చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల నుండి మహానాడు కార్యక్రమంలో సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేశారు. వీళ్ళందరికీ భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంటుందన్నారు.

ఇందుకోసం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకునేందుకు 15 కమిటీలను నియమించబోతున్నారు. ఒంగోలు పట్టణానికి  సమీపంలోని త్రోవగుంట బృందావన్ ఫంక్షన్ హాలు వెనకాలున్న 88 ఎకరాల్లో రెండు రోజుల మహానాడు నిర్వహణకు ఎంపిక చేశారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన కరెంటు సరఫరా, మంచినీటి సరఫరా వెహికల్ పార్కింగ్ తదితరాలకు ముందుగానే పోలీసులు, విద్యుత్ శాఖ మున్సిపల్ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

మామూలుగానే మహానాడు కార్యక్రమం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం టీడీపీ ఘనంగా నిర్వహిస్తుంది. కరోనా వైరస్ కారణంగా గడచిన రెండు సంవత్సరాలు మహానాడు కార్యక్రమాన్ని కేవలం జూమ్ యాప్ ద్వారా వర్చువల్ గా మాత్రమే నిర్వహించారు. ఇపుడు కోవిడ్ తీవ్రతతో పాటు ఆంక్షలు కూడా సడలించటంతో ప్రత్యక్షంగానే మహానాడు నిర్వహించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దానికి తోడు తొందరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతిష్టాత్మకంగా కూడా జరపాలని డిసైడ్ అయినట్లున్నారు.

27వ తేదీన విస్తృతస్థాయి సమావేశం, ఎన్టీఆర్ పుట్టినరోజైన 28వ తేదీన మహానాడు సమావేశం జరగబోతోంది. ఇదే రోజున బహిరంగ సభ కూడా ఉంటుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీని మహానాడు గా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలు, కరోనా వైరస్ లాంటి కారణాల వల్ల మాత్రమే మహానాడు రద్దయ్యింది. గుంటూరు, విజయవాడ, చీరాల, బాపట్ల, కావలి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు భారీఎత్తున హాజరవుతారని అనుకుంటున్నారు. అందుకనే ఏర్పాట్లు అంత భారీగా ఉండాలని చంద్రబాబు ఆదేశించింది.

This post was last modified on April 30, 2022 12:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

33 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago