Political News

లక్ష మందితో మహానాడు

ఒంగోలులో మే నెల 27,28 తేదీల్లో జరగబోయే టీడీపీ మహానాడుకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా. మహానాడు నిర్వహణపై చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల నుండి మహానాడు కార్యక్రమంలో సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేశారు. వీళ్ళందరికీ భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంటుందన్నారు.

ఇందుకోసం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకునేందుకు 15 కమిటీలను నియమించబోతున్నారు. ఒంగోలు పట్టణానికి  సమీపంలోని త్రోవగుంట బృందావన్ ఫంక్షన్ హాలు వెనకాలున్న 88 ఎకరాల్లో రెండు రోజుల మహానాడు నిర్వహణకు ఎంపిక చేశారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన కరెంటు సరఫరా, మంచినీటి సరఫరా వెహికల్ పార్కింగ్ తదితరాలకు ముందుగానే పోలీసులు, విద్యుత్ శాఖ మున్సిపల్ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

మామూలుగానే మహానాడు కార్యక్రమం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం టీడీపీ ఘనంగా నిర్వహిస్తుంది. కరోనా వైరస్ కారణంగా గడచిన రెండు సంవత్సరాలు మహానాడు కార్యక్రమాన్ని కేవలం జూమ్ యాప్ ద్వారా వర్చువల్ గా మాత్రమే నిర్వహించారు. ఇపుడు కోవిడ్ తీవ్రతతో పాటు ఆంక్షలు కూడా సడలించటంతో ప్రత్యక్షంగానే మహానాడు నిర్వహించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దానికి తోడు తొందరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతిష్టాత్మకంగా కూడా జరపాలని డిసైడ్ అయినట్లున్నారు.

27వ తేదీన విస్తృతస్థాయి సమావేశం, ఎన్టీఆర్ పుట్టినరోజైన 28వ తేదీన మహానాడు సమావేశం జరగబోతోంది. ఇదే రోజున బహిరంగ సభ కూడా ఉంటుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీని మహానాడు గా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలు, కరోనా వైరస్ లాంటి కారణాల వల్ల మాత్రమే మహానాడు రద్దయ్యింది. గుంటూరు, విజయవాడ, చీరాల, బాపట్ల, కావలి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు భారీఎత్తున హాజరవుతారని అనుకుంటున్నారు. అందుకనే ఏర్పాట్లు అంత భారీగా ఉండాలని చంద్రబాబు ఆదేశించింది.

This post was last modified on April 30, 2022 12:33 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

2 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

2 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

2 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

3 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

3 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

4 hours ago